ఉపాధి హామీ పనుల్లో లోపాలు | - | Sakshi
Sakshi News home page

ఉపాధి హామీ పనుల్లో లోపాలు

Jun 25 2025 6:58 AM | Updated on Jun 25 2025 6:58 AM

ఉపాధి హామీ పనుల్లో లోపాలు

ఉపాధి హామీ పనుల్లో లోపాలు

రికవరీలకు డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి ఆదేశాలు

యడ్లపాడు: ఉపాధి హామీ పథకం కింద నిర్వహించిన పనులపై 17వ విడత సామాజిక తనిఖీ నివేదికను ప్రతిపాదిస్తూ ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం బహిరంగ సభ (ప్రజావేదిక) నిర్వహించారు. 024 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 2025 మార్చి 31 వరకు మండలం పరిధిలో 1125 పనులను రూ.9,40,60,750 ఉపాధి నిధులతో చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ బృందం ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించింది. ఈ పనుల్లో అనేక నిర్వహణ లోపాలు ఉన్నట్లు డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి వెల్లడించారు. ఎంపీపీ పిడతల ఝాన్సీసాగర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎంపీడీవో వి హేమలతాదేవి, ఏపీడీ హీరాలాల్‌, ఏపీవో విజయకుమారి, ఏపీవో డి సుందర్రావు, టీఏ మాధవి, ఎస్‌ఆర్‌పీ బి ఆవులయ్య పాల్గొన్నారు. పీడీ వెల్లడించిన వివరాల ప్రకారం జంగిల్‌ క్లియరెన్స్‌ పనులకు సంబంధించి సరైన ఆధారాలు లేకుండానే బిల్లులు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. అలాగే శ్రామికుల మస్టర్లు అసంపూర్ణంగా ఉన్నాయన్నారు. పంటకాల్వల పూడిక తీతల పనుల్లోనూ అవకతవకలు ఉన్నట్లు తేలిందన్నారు. పనుల ప్రదేశాల్లో నేమ్‌బోర్డుల ఏర్పాటు చేయని విషయాలు వెలుగు చూశాయన్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్‌ పనులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయన్నారు. 5 శాతం రాయితీ జీవోను చూపకుండా 20 శాతం చెల్లింపులు చేయడం వంటి విషయాలు బయటపడ్డాయన్నారు. గత 16వ విడతలో రూ.1.73 లక్షల రికవరిలో ఇంకా రూ.63,390 బకాయి ఉందన్నారు. దీనిని వెంటనే రికవరీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement