
ట్రిపుల్ ఐటీల్లో సీట్లకు 89 మంది విద్యార్థుల ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: రాజీవ్గాంధీ సాంకేతిక, విజ్ఞాన విశ్వ విద్యాలయాల్లో (ట్రిపుల్ ఐటీ) ప్రవేశాలకు గుంటూరు జిల్లా నుంచి 89 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. 2025–26 విద్యా సంవత్సరానికి సోమవారం ప్రకటించిన జాబితాలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి టెన్త్ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు ఇంటర్మీడియెట్తో పాటు బీటెక్తో ఆరేళ్ల ప్రోగ్రామ్కు అర్హత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు 94.78 శాతం మేరకు ఉన్నట్లు ప్రవేశాల జాబితాలో పొందుపర్చారు. గుంటూరు జిల్లా నుంచి ట్రిపుల్ ఐటీల వారీగా నూజివీడు–31, ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ– 16, ఒంగోలు–35, శ్రీకాకుళంలో–7 చొప్పున ఉన్నారు. ఎంపికై న విద్యార్థులు ఆర్జీయూకేటీ వెబ్సైట్తో పాటు ప్రభుత్వ వాట్సాప్ సేవల నంబరు 95523 00009 ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆయా క్యాంపస్లలో ఈనెల 30 నుంచి జూలై 5వ తేదీ వరకు జరగనున్న కౌన్సెలింగ్కు విద్యార్థులు హాజరు కావాలి.
● గుంటూరు చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని పి.నాగసాయి రోషిణి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాల్లో అత్యధికంగా 573 మార్కులు సాధించడం ద్వారా ప్రవేశం పొందిన ఆమెను డీఈవో సీవీ రేణుక, ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి.పద్మజ అభినందించారు.