
నాణ్యత, మన్నికకు భారతి సిమెంట్
తెనాలిరూరల్: భవన నిర్మాణాలు శాశ్వతమైనవని, నిర్మాణం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారైన నాణ్యమైన సిమెంటును వినియోగదారులు ఎంచుకోవాలని భారతి సిమెంట్స్ అసిస్టెంట్ మేనేజర్(మార్కెటింగ్) పూల సురేష్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్.భవానీశంకర్ సూచించారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఆవులవారిపాలెం గ్రామంలోని శ్రీ సాంబశివ ట్రేడర్స్ సహకారంతో భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ మేస్త్రిలు, కార్మికులకు అవగాహన సదస్సును గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ అధునాతన పరిజ్ఞానంతో భారతి సిమెంట్ తయారవుతుందని తెలిపారు. కట్టడాలు పూర్తి నాణ్యతతో దీర్ఘకాలం మన్నేందుకు దోహదపడుతుందన్నారు. సిమెంటు తయారీకి నాణ్యమైన ముడి పదార్థాలనే తమ కంపెనీ ఎంచుకుంటుందని తెలిపారు. భవానీశంకర్ మాట్లాడుతూ భారతి సిమెంట్ వినియోగించిన కాంక్రీట్తో వేసిన శ్లాబులను ఏడు రోజుల అనంతరం తమ కంపెనీ ప్రతినిధులు వచ్చి నాణ్యతా పరీక్షలను చేసి, సిమెంట్ నాణ్యతను భవన నిర్మాణ మేస్త్రిలు, యజమానులకు వివరిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధిత డీలరు ద్వారా వివరాలు తెలుసుకుని తమకు సమాచారం అందిస్తే సరిపోతుందన్నారు. మేసీ్త్రల సందేహాలను నివృత్తి చేశారు. సదస్సుకు హాజరైన మేసీ్త్రలు, కార్మికులకు రూ.లక్ష చొప్పున ఉచిత బీమా సదుపాయం కల్పించి బాండ్లను అందజేశారు. శ్రీ సాంబశివ ట్రేడర్స్ యజమాని విష్ణుమొలకల పరమేశ్వరరావు, ఇతర డీలర్లు, భవన నిర్మాణ మేసీ్త్రలు, కార్మికులు పాల్గొన్నారు.