థియేటర్లో పరిచయంతో స్నేహితులుగా మారి.. | - | Sakshi
Sakshi News home page

థియేటర్లో పరిచయంతో స్నేహితులుగా మారి..

Apr 3 2025 2:06 PM | Updated on Apr 3 2025 2:06 PM

థియేటర్లో పరిచయంతో స్నేహితులుగా మారి..

థియేటర్లో పరిచయంతో స్నేహితులుగా మారి..

శివసుబ్రహ్మణ్యం 2009లో చీరాల నుంచి గుంటూరు వచ్చి స్థిరపడ్డాడు. తొలినాళ్లలో ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. 2018లో ఓ సినిమా ఽథియేటర్‌లో టైలర్‌ శ్రీను పరిచయమయ్యాడు. ఇద్దరికీ ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో 2022 నుంచి చోరీలకు శ్రీకారం చుట్టారు. ఒంటరిగా వెళ్లే మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లడం ప్రారంభించారు. స్కూటీపై వెళ్తూ గొలుసులు తెంచుకెళ్లేవారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా, ఆధారాల్లేకుండా జాగ్రత్తపడటంలో వీరు నేర్పరులు. ధనవంతులు ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా చోరీలు చేశారు. దొంగలించిన సొత్తును తెలిసిన వారి ద్వారా బంగారు దుకాణాల్లో విక్రయించేవారు. ఆ సొమ్ముతో అప్పులు తీర్చుకుని జల్సాలు చేసేవారు. వీరు పట్టాభిపురం పీఎస్‌ పరిధిలో 2, నల్లపాడు పీఎస్‌ పరిధిలో 4, తెనాలి వన్‌టౌన్‌ పరిధిలో 2, అరండల్‌ పేట పీఎస్‌, తెనాలి త్రీటౌన్‌ పీఎస్‌, చీరాల టూ టౌన్‌, చీరాల త్రీ టౌన్‌ పీఎస్‌ పరిధిలో ఒక్కొక్క చోరీ చేసినట్టు విచారణలో పోలీసులు తేల్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement