గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్లో శుక్రవారం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సభ్యులు ఢిల్లీకి చెందిన డాక్టర్ ఉమేష్, హైదరాబాద్కు చెందిన డాక్టర్ శ్రీనివాస్ తనిఖీలు చేశారు. న్యూరోసర్జరీ వైద్య విభాగంలో, యూరాలజీ వైద్య విభాగంలో తనిఖీలు చేశారు. ప్రస్తుతం ఉన్న సూపర్స్పెషాలిటీ పీజీ సీట్లు రెన్యూవల్ చేసేందుకు వైద్య కళాశాల, ఆసుపత్రిలో సరిపడా వైద్య సౌకర్యాలు, బోధనా సిబ్బంది ఉన్నారా, లేరా అనే విషయాలు పరిశీలించారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీలి ఉమాజ్యోతి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి, ఆ రెండు విభాగాల వైద్యులు, ఎన్ఎంసీ ఇన్స్పెక్టర్లతోపాటు ఉండి, వారు అడిగిన సమాచారం అందజేశారు. ప్రస్తుతం న్యూరో సర్జరీలో విభాగంలో నాలుగు పీజీ సీట్లు, యూరాలజీ వైద్య విభాగంలో రెండు పీజీ సీట్లు ఉన్నాయి.