
రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు
కర్మాగారం ప్రైవేటీకరిస్తే ఊరుకోం
పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీఐటీయు జిల్లా నాయకులు హెచ్చరించారు. 8లో u
మూలనపడిన ఆక్వా ల్యాబ్
మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆక్వా మొబైల్ ల్యాబ్ సేవలు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొంతకాలంగా సేవలు నిలిచిపోయాయి. 8లో u
మంగళవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2025
పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీని పరిరక్షించాలి
ఏలూరు (టూటౌన్): పెదవేగిలో పామాయిల్ ఫ్యాక్టరీని పరిరక్షించాలంటూ కార్మికులు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఐఎఫ్టీయూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ కార్పొరేట్ వ్యక్తులకు అమ్మడానికి సహకరించిన అవినీతి ఏపీ ఆయిల్ఫెడ్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీపై కా ర్పొరేట్ శక్తులు కన్ను వేశాయన్నారు. ముందు గా భారీ ప్రదర్శనగా కలెక్టరేట్ వద్దకు చే రా రు. ఐఎఫ్టీయూ నగర ప్రధాన కార్యదర్శి య ర్రా శ్రీనివాసరావు నాయకత్వం వహించారు.
తల్లికి వందనం ఇవ్వాలి
ఏలూరు (టూటౌన్): మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు తల్లికి వందనం, తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుచేయాలంటూ సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని పీజీఆర్ఎస్లో కలెక్టర్కు సమర్పించారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా గౌరవ అధ్యక్షుడు బి.సోమయ్య మాట్లాడుతూ తక్కువ వేతనాలతో పనిచేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు పథకాలు అమలు చేయకపోవడం శోచనీయం అన్నారు.
గర్జించిన అంగన్వాడీలు
ఏలూరు (టూటౌన్): తమకు సంక్షేమ పథకా లు అమలు చేయాలని, వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మా ర్చాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అంగన్వాడీలకు ఇచ్చిన హామీల ఊసెత్తడం లేదన్నారు. అర్హులందరికీ తల్లికి వందనం ఇస్తామని ప్రకటించి అంగన్వాడీలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకురాలు టి.మాణిక్యం, ఎంఏఎన్ తులసి మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందించారు. యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు కె.విజయలక్ష్మి నాయకత్వం వహించారు.
సొంత ప్రాంతాల్లో అవకాశమివ్వాలి
ఏలూరు (టూటౌన్): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీల్లో సొంత మండలం, సొంత మున్సిపాలిటీల్లో అవకాశం కల్పించాలని సచివాలయ ఉద్యోగుల జేఎసీ చైర్మన్ జీవీఎస్ శ్రీనివాస్ కోరారు. ఏలూరులో సోమవారం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు బదిలీల సమస్యలపై జేఏసీగా కలిసి పోరాడాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జీఓ 5తో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని, సొంత ప్రాంతాల్లో అవకాశమిచ్చేలా జీఓను సవరించాలని కోరారు. జేఎసీ నాయకులు కేఎస్సీ దు ర్గాప్రసాద్, ఎం.సునీత, పి.ప్రసన్న, సీహెచ్ శ్రీ నివాస్, కె.అబ్రహం తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ పరీక్షలకు 802 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో సోమవారం జరిగిన డీఎస్సీ పరీక్షలకు 802 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 183 మందికి 176 మంది, మధ్యాహ్నం 181 మందికి 149 మంది, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో మధ్యాహ్నం 134 మందికి 103 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 210 మందికి 200 మంది, మధ్యాహ్నం 198 మందికి 174 మంది హాజరయ్యారు.
విద్యుత్ అధికారుల బదిలీ
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీఈపీడీసీఎల్ ఏలూరు సర్కిల్ పరిధిలో ఇద్దరు అధికారులను బదిలీ చేస్తూ సంస్థ సీఎండీ పృధ్వీతేజ్ ఇమ్మడి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెదవేగి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐవీ మల్లేశ్వరరావును భీమడోలుకు, భీమడోలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.గోపాలకృష్ణను పెదవేగికి బదిలీ చేశారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ఏలూరు టౌన్: ప్రజలను ఏమార్చడంలో చంద్రబాబు నిపుణుడని, రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ యువజన విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బెదిరింపులు, భయపెట్టడం, అక్రమ కేసులు, నెలల తరబడి జైళ్లలో ఉంచేలా చేస్తూ రివేంజ్ రాజకీయాలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సోమ వారం ఏలూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన యువత పోరులో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాతో కలిసి ఆయన పాల్గొన్నారు. స్థానిక ఫైర్స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్లోని ఆరు హామీలు పూర్తి చేశా నని చెప్పడంతో ప్రజలు అవాక్కయ్యారన్నారు. జగన్ ఐదేళ్ల ముఖ్యమంత్రి అయినా, చంద్రబాబు 20 ఏళ్లు ముఖ్యమంత్రి అయినా ఒకటేనని, కేవలం ఐదేళ్లలోనే జగన్మోహన్రెడ్డి రూ.3 లక్షల కోట్ల మొత్తాన్ని సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు పంచితే చంద్రబాబు మాత్రం ఒక ఏడాదికే 1.30 లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. చంద్రబాబు గతంలో హామీలు అమలు చేయాల్సిన సమయంలోనూ హ్యాపీ సండే, దోమలపై దండయాత్ర అని డైవర్షన్ రాజకీయాలు చేశారని, ఇప్పుడేమో పథకాలడిగితే యోగాంధ్ర, ఊపిరి బాగా తీసుకోవాలంటూ హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పోలవరం నిర్మాణానికి ఖర్చు పెట్టిన దాని కంటే పోలవరం ప్రాజెక్టును అందరికీ చూపించడానికి రూ.100 కోట్లు ఖర్చు చేశారని, పని కంటే పబ్లిసిటీ ఎక్కువని విమర్శించారు. పవన్ కల్యాణ్ ప్రతి నియోజకవర్గంలో వంద మంది యువతకు రూ.10 లక్షల చొప్పున ఇస్తానని ఎన్నికల సమయంలో ప్రకటించారని, దానిని ఆయన మరచిపోయారన్నారు. కనీసం మీడియా, ప్రజలైనా దీనిపై ప్రశ్నించాలని సిద్ధార్థరెడ్డి కోరారు.
నిరుద్యోగ భృతి రూ.57 వేల కోట్ల బకాయి
రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన కొడుకుకు మాత్రం ప్రతిసారీ ఉద్యోగం ఇస్తున్నాడు గానీ నిరు ద్యోగ యువతను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తద్వారా లక్షలాది మంది నిరుద్యోగులను వంచించారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి ఈ ఏడాదికి సంబంధించి రాష్ట్రంలోని నిరుద్యోగ యు వతకు రూ.57 వేల కోట్లు చెల్లించాలని, లేదంటే వైఎస్సార్సీపీ యువత పోరును నిరంతరం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2.50లక్షల మంది వలంటీర్లను తొలగించారని, ఎండీయూలో పనిచేస్తున్న 15 వేల మందికి ఉపాధి తీశారని జక్కంపూడి రాజా మండిపడ్డారు.
ఫీజు బకాయిలు ఎప్పుడిస్తారు?
గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని, నేడు కూటమి పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
బాబు పాలనలో ప్రజలకు కష్టాలే..
సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని ప్రజలంతా అష్టకష్టాలు పడుతున్నారనీ, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, చివరకు వ్యాపారులు సైతం నష్టాల్లో ఉన్నారని పార్టీ ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్కుమార్ అన్నా రు. కార్పొరేట్ విద్యాసంస్థలకు మేలు చేసేందుకు ఇంజనీరింగ్ ఫీజులు సైతం పెంచేశారని ఆరోపించారు. తల్లికి వందనం పథకంలో 87 లక్షల మంది తల్లులు అర్హులు కాగా 57 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూర్చడం కూటమి ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కూడా అందించలేదన్నారు.
కదం తొక్కి.. నిరసన తెలిపి..
వైఎస్సార్సీపీ యువత పోరుకు భారీ ఎత్తున యువత, వైఎస్సార్సీపీ శ్రేణులు పోటెత్తారు. వేలాదిగా తరలిరావడంతో ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్ స్తంభించింది. ఉదయం 9.30 గంటలకే జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి శ్రేణులు తరలివచ్చారు. పార్టీ జెండాలు, ప్లకార్డులు, ప్లెక్సీలతో యు వత కేరింతలు కొడుతూ భారీ మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఫైర్స్టేషన్ సెంటర్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో యు వజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్థార్థ రెడ్డి, ఏలూరు పా ర్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్, సమన్వయకర్తలు మామిళ్లపల్లి జయప్రకాష్ (ఏలూరు), కంభం విజయరాజు (చింతలపూడి), పుప్పాల వా సుబాబు (ఉంగుటూరు), తెల్లం బాలరాజు (పోలవరం) దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా ఎన్ఆర్పేట, జెడ్పీ కార్యాలయం రోడ్డులో నుంచి కలెక్టరేట్కు చేరుకున్నారు. కలెక్టరేట్ వద్ద ౖబైఠాయించి కొద్దిసేపు ధర్నా చేశారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించటంతో పోలీసు లు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అనంతరం పార్టీ నేతలు ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు.
ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని, బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ, వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముంగర సంజయ్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గాదిరాజు మణికంఠ కిషోర్, కోటగిరి సందీప్, బసవ వినయ్, దాలి వెంకటేష్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా మోహనరావు, జెడ్పీ వైఎస్ చైర్మన్ పెనుమాల విజయ్బాబు, జెడ్పీ వైస్ చైర్మన్ జి.కృష్ణంరాజు, జెడ్పీటీసీలు నిట్టా లీలా నవకాంతం (దెందులూరు), భవానీ (భీమడోలు), కోడే వెంకట కాశీ విశ్వనాథ్ (నిడమర్రు), జయలక్ష్మి (ఉంగుటూరు), హేమ కుమారి (పోలవరం), కడిమి రమేష్ (కామవరపుకోట), పోల్నాటి బాబ్జీ (జంగారెడ్డిగూడెం), జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితా రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు పిల్లా చరణ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రాజేష్, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాసరావు, అంగన్వాడీ అధ్యక్షురాలు శైల స్వాతీ యాదవ్, లీగల్సెల్ అధ్యక్షుడు అల్తి శ్రీనివాసరావు, సోషల్ మీడియా అధ్యక్షుడు చిక్కాల దుర్గాప్రసాద్, బూత్ కమిటీ అధ్యక్షుడు చింత అనిల్కుమార్, ప్రచార కమిటీ అధ్యక్షుడు చిలుకూరి జ్ఞానరెడ్డి, ఆర్టీఐ అధ్యక్షుడు స్టాలిన్బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, పోలవరం నియోజకవర్గ అధ్యక్షుడు జైబాబు, దెందులూరు యువజన అధ్యక్షుడు పెద్దిరాజు, కై కలూరు యువజన అధ్యక్షుడు చార్లెస్, జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకీ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ అప్పనవీడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
న్యూస్రీల్
బెదిరింపులు, అక్రమ కేసులు, జైళ్లతోనే పాలన
కూటమి పాలనలో తలలు నరికితే తప్పు లేదా?
వైఎస్సార్సీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
ఏలూరులో యువత పోరుకు కదం తొక్కిన నిరుద్యోగులు
భారీ ర్యాలీ, కలెక్టరేట్ వద్ద ధర్నా

రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు

రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు

రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు

రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు

రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు

రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు

రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు

రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు