అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Jun 24 2025 4:07 AM | Updated on Jun 24 2025 4:07 AM

అనుమా

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

నూజివీడు: మండలంలోని ముక్కొల్లుపాడులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వ్యక్తి మృతిపై మృతుడి తల్లి బండారు దుర్గమ్మ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండారు కోటేశ్వరరావు(44) పొక్‌లైయిన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి నూజివీడు రామాయమ్మరావుపేటకు చెందిన ప్రమీలతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. ప్రమీలకు అదే గ్రామానికి చెందిన ఇర్ల మహేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై ప్రమీలకు ఆమె భర్త కోటేశ్వరరావుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో తల్లి దుర్గమ్మ కొడుకును నిద్ర లేపగా ఎంతకీ లేవకపోయే సరికి పరీక్షించగా.. మృతిచెంది ఉన్నాడు. ఆదివారం సాయంత్రం ఇర్ల మహేష్‌ తల్లి జమలమ్మ, మహేష్‌ తమ్ముడు భార్య హైమావతి కలిసి కోటేశ్వరరావుతో గొడవ పడ్డారు. కోటేశ్వరరావు ఇంటికి వెళ్లి భోజనం పెట్టమని అడగగా భార్య పెట్టకపోవడంతో తన అన్న ఇంటికి వెళ్లి భోజనం చేశాడు. భోజనం చేసిన కొద్దిసేపటికే కోటేశ్వరరావు వాంతులు చేసుకున్నాడు. ఆ తరువాత ఇంటికి వెళ్లి పడుకున్నాడు. తన కుమారుడి మృతి విషయంలో కోడలు ప్రమీల, ఇర్ల మహేష్‌పై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఎస్‌ఐ జ్యోతిబసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసుల రాజీకి కృషిచేయాలి

భీమవరం: పట్టణంలో జూలై 5వ తేదీన నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులను రాజీ చేయడానికి కృషి చేయాలని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్‌, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బి లక్ష్మీనారాయణ అన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసుల రాజీకి తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి పోలీసు స్టేషన్‌లో ఎన్ని రాజీపడదగ్గ కేసులున్నాయనే వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉన్న కేసుల రాజీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌) ఎం.సుధారాణి, 1వ అదనపు మొదటి తరగతి మేజిస్ట్రేట్‌ పి.హనీష, 2వ అదనపు మొదటి తరగతి మేజిస్ట్రేట్‌ ఎన్‌.జ్యోతి, బెంచ్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ నాగరాజు, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె సుజాత, వివిధ పోలీసుస్టేషన్‌ అఽధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి 1
1/1

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement