యువత జీవితాలతో కూటమి ఆటలు | - | Sakshi
Sakshi News home page

యువత జీవితాలతో కూటమి ఆటలు

Jun 24 2025 4:07 AM | Updated on Jun 24 2025 4:07 AM

యువత

యువత జీవితాలతో కూటమి ఆటలు

భీమవరం: యువతను నిండా మోసం చేసిన కూట మి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం పశ్చి మగోదావరి జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్‌ హెచ్చరించారు. భీమవరంలో చేపట్టిన యువత పో రు నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూటమి అధికారం చేపట్టి ఏడాది గడిచినా ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయలేదని, అయినా లక్షల కోట్లు అప్పులు చేస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఆర్బాటాలు చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అంటూ ప్ర చారం చేసిన సీఎం చంద్రబాబు ఒక్క హామీ కూ డా అమలుచేయకుండా యువత జీవితాలను ఆటలా డుకుంటున్నారని దుయ్యబట్టారు. 20 లక్షల ఉ ద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, పె ద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకా శా లు కల్పిస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్ర శ్నించారు. ఏడాదిలో జిల్లాలో యువతకు నిరుద్యోగ భృతి బకాయిలు రూ.7,200 కోట్లు ఎగ్గొట్టారన్నారు.

వలంటీర్ల వ్యవస్థకు మంగళం

వైఎస్సార్‌సీపీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతికి ఎగనామం పెట్టడంతో పాటు వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడిందని విమర్శించారు. యువతకు ఉద్యోగాలంటూ మోసం చేసి గొప్పల కోసం డబ్బును వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడంతో పాటు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలను కూడా గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. తల్లికి వందనం పథకంలో కొర్రీలు, వసతి దీవెన, విద్యాదీవెన పథకాల ఊసేలేదన్నారు.

విస్సాకోడేరు వంతెన వద్ద నుంచి ర్యాలీగా..

జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్సా ర్‌ సీపీ యువత విభాగం నాయకులు, కార్యకర్తలు భీమవరంలో విస్సాకోడేరు వంతెన వద్ద నుంచి ర్యా లీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వినతిపత్రం ఇవ్వడానికి ఐదుగురికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో సందీప్‌, వీరన్న, బంధం పూర్ణచంద్రరావు తదితరులు కలెక్టరేట్‌లోకి వెళ్లి జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పార్టీ భీమవ రం పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, మాజీ అధ్యక్షుడు కోడే యుగంధర్‌, రాష్ట్ర యూత్‌ జనరల్‌ సెక్రటరీ మంతెన సునీల్‌వర్మ, జాయింట్‌ సెక్రటరీ సత్తి రాజశేఖరరెడ్డి, కార్యదర్శి బలం శ్రీను, మానుకొండ ప్రదీప్‌, జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ తమనంపూడి సూర్యారెడ్డి, స్టూడెంట్‌ వింగ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాహుల్‌, అరిగెల అభి షేక్‌, బేతల సంతోష్‌, జోగాడ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

అడుగడుగునా ఆంక్షలు

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన యువత పోరు, సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ అంగన్‌వాడీలు, తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలని సెకండ్‌ ఏఎన్‌ఎంలు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు పోలీసులు ఆంక్షలతో ఇబ్బంది పెట్టారు. కలెక్టరేట్‌లో వినతిపత్రం ఇవ్వడం కోసం వైఎస్సార్‌సీపీ యువత విభాగం నాయకులు పట్టణంలోని విస్సాకోడేరు వంతెన వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో షామియానా వేసి కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. 50 మందికి మించి వెళ్లడానికి వీల్లేదంటూ కలెక్టరేట్‌కు కిలోమీటరు దూరంలోనే అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అలాగే అంగన్‌వాడీలను విస్సాకోడేరు వంతెన వద్ద పోలీసులు నిలువరించారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామంటూ అంగన్‌వాడీల కార్యకర్తలు హెచ్చరించారు.

వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ‘పశ్చిమ’ జిల్లా అధ్యక్షుడు సందీప్‌

భీమవరంలో ర్యాలీ, ధర్నా

యువత జీవితాలతో కూటమి ఆటలు 1
1/1

యువత జీవితాలతో కూటమి ఆటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement