
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం–జంగారెడ్డిగూడెం జాతీయ ప్రధాన రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. నీలాలమ్మ ఆలయ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించిందని ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపారు. యర్రంపేట గ్రామానికి చెందిన రాపాక కల్యాణ్(26) జంగారెడ్డిగూడెం నుంచి టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్పై స్వగ్రామం వెళ్లేందుకు కొయ్యలగూడెం వైపునకు వస్తుండగా కారు ఢీకొంది. కల్యాణ్కు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి అంబులెన్సులో తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై మృతుడి తల్లి రాపాక మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.