
శ్రమ పాత్ర కీలకం
ఏలూరు టౌన్: సమాజ పరిమాణం, అభివృద్ధిలో శ్రమ పాత్ర కీలకమని సినీ రచయిత సు ద్దాల అశోక్ తేజ అన్నారు. స్థానిక టుబాకో మర్చంట్స్ కల్యాణ మండపంలో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన 60వ శ్రమ కావ్యం–గానం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ ఆహ్వానం పలకగా జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు అధ్యక్షత వహించారు. అశోక్ తేజ తాను రచించిన శ్రమకావ్యం పుస్తకంలో అనేక ఘట్టాలను ఆల పిస్తూ సవివరంగా విశ్లేషించారు. రిటైర్డ్ రిజిస్ట్రా ర్ లంక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్రమ కా వ్యం రచనలో శ్రమను వస్తువుగా తీసుకుని రచన సాహసోపేతం అన్నారు. సీఐటీయూ రా ష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మా ట్లాడుతూ శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని సీఐటీయూ దేశవ్యాప్తంగా ఉద్య మాలు చేస్తోందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మంతెన సీతారాం పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్లో తనిఖీలు
ఏలూరు టౌన్: ఏలూరు రైల్వేస్టేషన్లో రైల్వే పో లీసులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. విజయవాడ రైల్వే డీఎస్పీ జి.రత్నరాజు పర్యవేక్షణ లో విజయవాడ లైన్ సర్కిల్ సీఐ ఎంవీ దుర్గారావు, ఏలూరు రైల్వే ఎస్సై పి.సైమన్ ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించిన రైల్వే పోలీస్ ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలకు ఆదేశాలు ఇచ్చారని ఎస్సై చెప్పారు.
డీఎస్సీ పరీక్షలకు 532 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): డీఎస్సీ పరీక్షలకు రెండో రోజు ఆదివారం జిల్లాలో 532 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఏలూరులోని సిద్ధార్థ క్వెస్ట్లో మధ్యాహ్నం 180 మందికి 156 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 208 మందికి 202 మంది, మధ్యాహ్నం 204 మందికి 174 మంది హాజరయ్యారు.
10న ఆందోళనలు
ఏలూరు టౌన్: గ్రామీణ పేదల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10న ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన, వినతిపత్రాల అందజేతకు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కంచర్ల గురవ య్య, బండి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.
నేడు యోగాంధ్ర ర్యాలీలు
ఏలూరు(మెట్రో): యోగాంధ్ర కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలనీ కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం ఉదయం గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లోలో ర్యాలీలు నిర్వహించాలన్నారు.
నేడు పీజీఆర్ఎస్ రద్దు
అనివార్య కారణాలవల్ల సోమవారం ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు ప్రకటనలో తెలిపారు.
పని వేళల మార్పుపై ఆగ్రహం
ఏలూరు టౌన్: కార్మికుల హక్కులను కాలరాస్తూ 10 గంటల పని విధానాన్ని అమలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే విర మించుకోవాలనీ, రాత్రి వేళల్లో మహిళలతో పని చేయించవద్దని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏలూరు ఆర్ఆర్పేట నగరపాలక పార్కు వద్ద ఆదివారం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాల కాపీలను ఏఐటీయూసీ నాయకులు దగ్ధం చేశారు.
రూ.69.30 లక్షల ఆన్లైన్ మోసం
ఏలూరు టౌన్: తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయంటూ ఒక మహిళను నమ్మించి ఆన్లైన్లో భారీగా నగదును కాజేశారు. ఏ లూరు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు రూరల్ వెంకటాపురం పంచాయతీ గ్రీన్సిటీ ప్రాంతానికి చెందిన మె యిదా కృష్ణభవానీ (30) గతంలో ఒక ప్రైవేటు స్కూల్లో పనిచేశారు. ఆమె సెల్ఫోన్ వాట్సాప్కు గతనెల 19న అమాన్సా పీటీ ప్రైవేట్ లి మిటెడ్ యాప్ నుంచి ఇన్వెస్ట్మెంట్ లింకు వచ్చింది. లింకును ఓపెన్ చేసిన కృష్ణభవానీ తనపేరుతో అకౌంట్ రిజిస్టర్ చేసుకున్నారు. మరో నంబర్ నుంచి అదే యాప్ డౌన్లోడ్ చేసి చాటింగ్ చేశారు. ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలు ఆర్జించినట్లు చాటింగ్లో పలువురు చెప్పగా ఆమె నమ్మారు. దీంతో ఆమె పలు దఫాలుగా రూ.69.30 లక్షల పలు ఖాతాలకు చెల్లించారు. అయితే ఎలాంటి లాభాలు లేకపోవడంతో తాను మోసపోయినట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఆదివారం ఏలూరు వన్టౌన్ సీఐ జి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ ఎస్సై సీహెచ్కే దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.