
దగా పాలనకు విజయోత్సవాలా?
బదిలీ.. రాజకీయ కుట్రేనా!
కొయ్యలగూడెం తహసీల్దార్ కుంజా చెల్లన్నదొర బదిలీ చర్చనీయాంశంగా మారింది. భూమి విషయంలో ఒత్తిళ్లకు లొంగకపోవడమే బదిలీకి కారణమని ప్రచారం సాగుతోంది. 8లో u
జూదాలకు బానిసై..
జూదాలకు బానిసైన ఓ వ్యక్తి యజమాని ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 8లో u
బుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025
ఏలూరు (ఆర్ఆర్పేట): దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమం అంటే ఏమిటో ప్రజలకు రుచి చూపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాయంలో పేదల సంక్షేమం కోసం నవరత్నాలు ప్రకటించి వాటిని అమలు చేశారు. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, మద్య నియంత్రణ, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, పేదలందరికీ ఇళ్లు, వైఎస్సార్ ఆసరా, చేయూత, పింఛన్ల కానుక ఇలా అన్నింటిని అమలు చేశారు. సూపర్ సిక్స్ ఊదరగొట్టి.. పథకాలు అమలు చేయలేక చతికిలపడింది కూటమి ప్రభుత్వం. ఓటేసిన ప్రజలను మోసగిండమే కాకుండా.. ఈ నెల 12న భారీ ఎత్తున విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. సంక్షేమ పథకాలు అందించలేని ప్రభుత్వం, అభివృద్ధి కార్యక్రమాలు చేయని నాయకులు విజయోత్సవాలు ఎలా చేసుకుంటారని నిలదీస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఎగ్గొట్టి ప్రజలను మోసం చేసినందుకు విజయోత్సవాలు చేసుకుంటారా? అన్ని ప్రశ్నిస్తున్నారు.
మేనిఫెస్టోలో చెప్పన హామీలు కూడా..
జగన్ మేనిఫెస్టోలో ఇవ్వని పలు సంక్షేమ పథకాలను కూడా అందించారు. 43,765 స్వయం సహాయక సంఘాలకు నాలుగు విడతలుగా రూ.221.99 కోట్లు, 9814 గ్రూపుల్లోని 39,225 మందికి రూ.546.53 కోట్ల సీ్త్రనిధి రుణాలు, వైఎస్సార్ కాపు నేస్తంలో 19,868 మందికి రూ.119.21 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా 14,274 మందికి రూ.42.82 కోట్లు అందించారు. జిల్లాలో 868.566 కిలోమీటర్ల రహదారులను రూ.627.96 కోట్లతో అభివృద్ధి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా సూపర్ సిక్స్ పథకాలనే అమలు చేయలేక చతికిల పడింది.
సూపర్ సిక్స్ పేరిట ఇంత మోసమా?
గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి సూపర్సిక్స్ పథకాలు పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల సభల్లో ఊదరగొట్టారు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు, ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేల ఆర్థిక సహాయం, మహిళకు నెలకు రూ.1500, మహిళలకు ఉచిత బస్సు. ఈ పథకాలన్నీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమలు చేస్తామని బీరాలు పలికింది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్క గ్యాస్ సిలెండర్ తప్ప ఇంతవరకూ మరో పథకానికి శ్రీకారం చుట్టలేదు. గ్యాస్ సిలెండర్కు కూడా ఒక సిలెండర్కు మాత్రమే నగదు జమచేశారు.
న్యూస్రీల్
మేనిఫెస్టోలో చెప్పని హామీలు అమలు చేసిన జగన్
ఏడాది గడుస్తున్నా సూపర్ సిక్స్కు మోక్షం లేదు
ఏ పథకం అమలు చేయకుండా కూటమి ఉత్సవాలపై జనాగ్రహం
గత ప్రభుత్వంలో జిల్లాకు లబ్ధి
అమ్మ ఒడిలో ఏటా 1,78,214 మందికి మొత్తం రూ.1069.30 కోట్లు అందచేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్లో ఏటా 37,750 మందికి రూ.142.96 కోట్లు జమ చేశారు.
వైఎస్సార్ చేయూతలో 1,16,491 మందికి రూ.561.53 కోట్లు
వైఎస్సార్ ఆసరాలో నాలుగు విడతల్లో 3,55,315 మంది మహిళలకు రూ.1305.05 కోట్లు
ఆరోగ్యశ్రీ ద్వారా 1,95,651 మందికి రూ.410.18 కోట్లతో వైద్యం
పేదలందరికీ ఇళ్ల పథకంలో 1,16,431 మందికి ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్లు, 98,874 మందికి ఇళ్ళనిర్మాణం కోసం రూ.713. 17 కోట్ల ఖర్చు
రైతు భరోసాలో 2,35,847 మంది రైతులకు రూ.1839.24 కోట్లు
జలజీవన్ మిషన్లో రూ. 606.08 కోట్లతో పల్లెల్లో రక్షిత మంచినీటి పథకాన్ని అమలు
ఉద్యోగాలిస్తారనే నమ్మకం పోయింది
20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, లేదా నెలకు 3 వేల భృతి అని చెప్పారు. దీంతో కూటమి అభ్యర్థికి గుడ్డిగా ఓటేశాం. ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా ఉద్యోగం మాట అటుంచి భృతి మాట ఎత్తడం లేదు. ప్రభుత్వం వలంటీర్లను తొలగించింది, రేషన్ వాహనాలను తొలగించి మరికొంతమందికి ఉపాధిని దూరం చేసింది.
– జొన్నగడ్డ సుజీవ్ కుమార్, నిరుద్యోగి
మోసగించడమే..
మహిళలకు ఉచిత బస్సు అనే పథకానికి పెద్ద ఖర్చేమీ అవదు. అలాంటి చిన్న పథకాన్ని కూడా అమలు చేయకపోవడా న్ని ఏమనుకోవాలి. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. మన పాలకులు ఆపాటి చేయలేకపోవడం దురదృష్టకరం. గ్యాస్ తప్ప ఇంకేమీ ఇవ్వక పోవడం మహిళలను మోసగించడమే.
– గొల్లవిల్లి ఆదిలక్ష్మి, గృహిణి
సంక్షేమం రుచి చూపించిన జగన్
పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు సంక్షేమం అంటే ఏమిటో రుచి చూపించిన గత ప్రభుత్వాన్ని, ఏడాది గడిచినా ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయని కూటమి ప్రభుత్వాన్ని బేరీజు వేసుకుంటూ ప్రజల్లో పెద్ద చర్చ సాగుతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ సంక్షేమాన్ని మరిచిపోకుండా పేద ప్రజలకు ఇళ్లు, పేద మహిళలకు వివిధ రూపాల్లో నగదు జమ, ప్రతీ నెలా ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించారు. ఏడాది గడుస్తున్నా కేవలం మాటలు తప్ప చేతల్లోకి దిగని కూటమి ప్రభుత్వానికి నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

దగా పాలనకు విజయోత్సవాలా?

దగా పాలనకు విజయోత్సవాలా?

దగా పాలనకు విజయోత్సవాలా?