
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
టి.నరసాపురం: వ్యాన్, మోటార్ సైకిల్ ఢీకొన్న ఘటనలో మోటార్సైకిలిస్ట్ మృతిచెందాడు. ఎస్సై ఎం జయబాబు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపూడి మండలం బట్టువారిగూడెంకు చెందిన జక్కుల ప్రకాష్ (21) టి.నరసాపురం మండలం కె.జగ్గవరంలో ఓ ఫంక్షన్కు వెళ్లి మోటార్సైకిల్పై తిరిగి వస్తున్నాడు. రాజుపోతేపల్లి అడ్డరోడ్డు వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న వ్యాన్ మోటార్సైకిల్ను ఢీకొనడంతో ప్రకాష్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని తండ్రి జక్కుల నరసింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జయబాబు చెప్పారు.