
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళా సాధికారత
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా డ్వాక్రా మహిళలతో మహిళా మార్టుల పేరుతో సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించారు. చింతలపూడి, జంగారెడ్డిగూడెంలో మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన మహిళా మార్టులు రోజూ రూ.లక్ష టర్నోవర్ సాధించగా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రస్తుతం టర్నోవర్ రూ.40 వేలకు పడిపోయింది.
రికార్డు స్థాయిలో ఇళ్ల పట్టాలు
జిల్లాలో రికార్డు స్థాయిలో 1,16,431 మంది మహిళలకు ఇళ్ల పట్టాలు అందించి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించారు. 98 వేల ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం ద్వారా ప్రతి మహిళకు సగటున రూ.15 లక్షలకుపైగా వ్యక్తిగత ఆస్తిని సమకూర్చారు.