నీకు 15 వేలు.. నీకు 15 వేలు.. నీకు 18 వేలంటూ గడపగడపకు ప్రస్తుత మంత్రి నిమ్మల ప్రచారం.. ఆడవాళ్లందరికీ ఉచిత బస్సు.. ద్వారకాతిరుమల, తిరుపతి, సింహాచలం ఇలా ఏ పుణ్యక్షేత్రమైనా ఉచితంగా వెళ్లి రావొచ్చు అంటూ కూటమి నాయకుల హామీలు.. అధికారంలోకి రాగానే ఇళ్ల నిర్మాణం చేపడతాం.. మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దుతాం.. డ్వాక్రా సంఘాలకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువస్తాం.. అంటూ గత ఎన్నికల సమయంలో లెక్కకు మించి హామీలిచ్చారు.. తీరా అధికారం చేపట్టిన తర్వాత మహిళా సంక్షేమాన్ని పక్కన పెట్టారు కూటమి నాయకులు.. గద్దెనెక్కి ఏడాది గడిచినా ఒక్క పథకాన్నీ అమలుచేయకపోగా.. కనీసం అమలుపై స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.
మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా 18–59 ఏళ్ల మహిళలందరికీ నెలకు రూ.1,500, తల్లికి వందనం, డ్వాక్రా రుణాల పరిమితి రెట్టింపు, ఉచిత బస్సు ఇలా అడ్డగోలు హామీలిచ్చింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలతో పాటు పలు సంక్షేమ పథకాలు మహిళల పేరుతో అమలు చేయగా.. ప్రస్తుత కూటమి సర్కారు ఏడాది గడిచినా ఒక్క హామీ అమలుచేయకపోవడంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ఇప్పటికే ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ఎప్పుడిస్తారంటూ నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నా ప్రభు త్వం పట్టించుకోని పరిస్థితి.
‘ఆడబిడ్డ’కు అన్యాయం : జిల్లాలో 19–59 ఏళ్ల వయసున్న మహిళలు 6,71,033 మంది ఉన్నారు. వీరందరికీ నెలకు రూ.1,500 చొప్పున కూటమి హామీ మేరకు ఆడబిడ్డ నిధి పేరుతో సాయం అందించాల్సి ఉంది. మొదటి ఏడాది ఈ పథకం మేరకు జిల్లాలో మహిళలకు రూ.1,207.80 కోట్లు అందించాల్సి ఉంది. అయితే పథకాన్ని అమలు చేయకపోవడంతో ఈ మొత్తాన్ని మహిళలు నష్టపోయారు. ఇక ఉచిత బస్సు విషయంలోనూ కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. పథకం అమలుపై స్పష్టత లేదు. జిల్లాలో 305 ఆర్టీసీ సర్వీసుల్లో ఉచిత బస్సు పథకం త్వరలో అమలులోకి తెస్తామని పదేపదే ప్రకటిస్తూ ఏడాది గడిపేశారు.
తల్లికి పంగనామం : తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలుంటే అందరికీ రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఊదరగొట్టారు. తీరా అధికారం చేపట్టి ఏడాది గడిచినా ఈ ఊసేలేదు. దీంతో మొదటి సంవత్సరంలో జిల్లాలో ఉన్న 2,91,858 మంది విద్యార్థులు, 31,445 మంది ఇంటర్ విద్యార్థులు రూ.486.96 కోట్ల మేర నష్టపోయారు. గత ప్ర భుత్వ హయాంలో జిల్లాలో 1,78,214 మంది తల్లు ల ఖాతాల్లో మొత్తంగా రూ.1,069.30 కోట్లను మా జీ సీఎం జగన్ జమ చేయించారు.
న్యూస్రీల్
గత ప్రభుత్వంలో మహిళలకు పథకాల లబ్ధి
జిల్లాలో 30,917 స్వయం సహాయక సంఘాలకు రూ.7,002 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు అందించారు.
వైఎస్సార్ చేయూత కింద 1,16,491 మందికి రూ.561.53 కోట్ల లబ్ధి చేకూర్చారు.
వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 19,868 మందికి రూ.119.21 కోట్లు జమ చేశారు.
వైఎస్సార్ ఆసరా ద్వారా 35,745 గ్రూపుల్లోని 3,55,315 మంది మహిళలకు రూ.1,305.05 కోట్ల రుణమాఫీ చేశారు.
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 43,765 స్వయం సహాయ సంఘాలకు రూ.221.99 కోట్ల లబ్ధి చేకూర్చారు.
సీ్త్ర నిధి రుణాల కింద 9814 గ్రూపుల్లో 39,255 మంది మహిళలకు రూ.546.53 కోట్లు అందించారు.
వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల్లోని పేదలకు మూడు విడతల్లో రూ.45 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు.
ఆడబిడ్డలకు ద్రోహం
ప్రభుత్వం రాగానే ఆడబిడ్డ నిధి పథకం అమలుకు కూటమి హామీ
19 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.1,500
జిల్లాలో అర్హులు సుమారు 6.71 లక్షల మంది
పథకం అమలు ఊసెత్తని ప్రభుత్వం
ఏడాది కాలానికి రూ.1,207 కోట్లు నష్టపోయిన జిల్లాలో మహిళలు
ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తంతో మహిళలకు అండగా జగన్ సర్కారు
ఏడాదైనా ఒక్క పథకం లేదు
సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి నాయకులు మహిళలను ఆకట్టుకునేలా పలు హామీ లిచ్చారు. తల్లికి వందనం, ఉచిత బస్సు, గ్యాస్, ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు. అధికారం చేపట్టి ఏడాది గడిచినా మహిళలకు ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను ఏడాదిలోపే మాజీ సీఎం జగన్ అమలు చేసి చూపించారు.
– కనమతరెడ్డి చండీప్రియ, నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు, చింతలపూడి
కాపులను దగా చేశారు
కాపు నేస్తం పేరిట గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాపులందరినీ ఆదుకున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మహిళల అభ్యున్నతితోనే సమాజం బాగుంటుందని భావించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసింది. మహిళా సాధికారతకు కృషి చేసింది. కూటమి ప్రభుత్వం పలు హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేస్తోంది.
– అప్పన పద్మావతి,
వైస్ ఎంపీపీ, పెదపాడు మండలం
అతివలకు అన్యాయం
అతివలకు అన్యాయం
అతివలకు అన్యాయం
అతివలకు అన్యాయం
అతివలకు అన్యాయం