ఉపాధి వేతనాల కోసం గళం | - | Sakshi
Sakshi News home page

ఉపాధి వేతనాల కోసం గళం

Jun 3 2025 5:29 AM | Updated on Jun 3 2025 5:29 AM

ఉపాధి వేతనాల కోసం గళం

ఉపాధి వేతనాల కోసం గళం

నూజివీడు: ఉపాధి హామీ పథకం కూలీలకు 8 వారాలుగా పెండింగ్‌లో ఉన్న కూలి డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొక్కిరిపాటి ఆనంద్‌ డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలు వేతనాలు విడుదల కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే వేతనాలు విడుదల చేయాలని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు కర్రి రామకృష్ణ, సీపీఐ నాయకులు నిమ్మగడ్డ నరసింహా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement