
ఉపాధి వేతనాల కోసం గళం
నూజివీడు: ఉపాధి హామీ పథకం కూలీలకు 8 వారాలుగా పెండింగ్లో ఉన్న కూలి డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొక్కిరిపాటి ఆనంద్ డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలు వేతనాలు విడుదల కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే వేతనాలు విడుదల చేయాలని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు కర్రి రామకృష్ణ, సీపీఐ నాయకులు నిమ్మగడ్డ నరసింహా తదితరులు పాల్గొన్నారు.