
ఇళ్ల స్థలాల కోసం ధర్నా
ఏలూరు (టూటౌన్): ప్రభుత్వం హామీ మేరకు పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలంటూ బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని, ఇంటి స్థలాలు మంజూరు చేయాలంటూ నినదించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి.కిషోర్, బీకేఎంయూ కార్యదర్శి పొట్టేలు పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
కౌలు రైతుల వినూత్న నిరసన
భీమడోలు: కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలని, భూ యాజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం భీమడోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద కౌలు రైతులు ధర్నా చేశారు. మండుటెండలో మోకాళ్లపై నిలిచి నిరసన తెలిపారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీని వాస్, జిల్లా కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హామీలను అమలు చేయాలన్నారు. అనంతరం ఎంపీడీఓ సీహెచ్ పద్మావతిదేవి, ఏఓ ఎస్పీవీ ఉషారాణికి వినతిపత్రం అందించారు.
ఆయిల్పామ్ రైతుల ఆక్రోశం
ద్వారకాతిరుమల: కేంద్ర ప్రభుత్వం పామాయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని ఎం.నాగులపల్లిలో ఆయిల్పామ్ గెలల కాటా వద్ద ఆయిల్పామ్ రైతులు సో మవారం ధర్నా నిర్వహించారు. ఆయిల్పామ్ కు గిట్టుబాటు ధర కల్పించాలని, ఫ్యాక్టరీ యాజమాన్యాలు గెలల ఏరివేతను ఆపాలంటూ నినాదాలు చేశారు. సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచన చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, మండల అధ్యక్షుడు బోయపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పొగాకు రైతుల ఆందోళన
జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకుకి కిలోకి రూ.450 గిట్టుబాటు ధర ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్ముల సురేష్ డిమాండ్ చేశారు. పొగాకుకి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ పొగాకు కంపెనీలు కుమ్మకై ్క రైతులకు అన్యాయం చే స్తున్నాయని ఆరోపించారు. పొగాకును రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు కారం రాఘవ, న్యాయవాది, రైతు యు.ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.
5న ఐటీఐ కౌన్సెలింగ్
ఏలూరు (టూటౌన్): 2025–26కి సంబంధించి ఐటీఐ ప్రవేశాలకు ఈనెల 5న ఏలూరులో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ఏలూరు స త్రంపాడు ఐటీఐ ప్రిన్సిపాల్ పి.రజిత సో మవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 5 ప్రభుత్వ ఐటీఐల్లో 804, 14 ప్రైవేట్ ఐటీఐల్లో 1,672 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

ఇళ్ల స్థలాల కోసం ధర్నా