
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
చాట్రాయి: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. మండలంలోని పోలవరం గ్రామానికి చెందిన పరసా ఈశ్వరరావు ఇంటి పక్కన ఉన్న 11 కేవీ వైరు ఇంటి సర్వీస్ వైరుపై పడి ఇల్లంతా విద్యుత్ ప్రసారం అయ్యింది. ఆ సమయంలో గదిలో నిద్రపోతున్న పరసా ప్రభు కిరణ్(18) బోర్డులో స్విచ్ ఆపుతుండగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఐ రామకృష్ణ తెలిపారు.
గోదావరిలో దూకిన
యువకుడి గల్లంతు
యలమంచిలి: మండలంలోని చించినాడ వశిష్ట గోదావరి వంతెన మీద నుంచి దూకి యువకుడు గల్లంతైనట్లు ఎస్సై కె గుర్రయ్య తెలిపారు. వంతెనపై దొరికిన బైక్, సెల్ఫోన్ ఆధారంగా అతడు భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన షేక్ కాసు (24)గా అనుమానిస్తున్నారు. ఈ మేరకు షేక్ కాసు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు.
ఎకై ్సజ్ కేసుల్లో నలుగురి బైండోవర్
భీమవరం: ఎకై ్సజ్ కేసులకు సంబంధించి భీమవరం మండలంలోని నలుగురు వ్యక్తులను బుధవారం భీమవరం తహసీల్దార్ ఆర్ రాంబాబు వద్ద బైండోవర్ చేసినట్లు భీమవరం ఎకై ్సజ్ సీఐ కె బలరామరాజు చెప్పారు. బైండోవర్ చేసిన వారిలో ఇళ్ల శ్రీనివాసరావు, యెలుదూటి నాగన్న, యల్ల శేఖర్, బడుగు రవి ఉన్నారన్నారు. వీరు ఏడాది కాలంలో మరోసారి ఎకై ్సజ్ నేరంలో పట్టుబడితే రూ.లక్ష జరిమానా చెల్లించాల్సి ఉంటుందని సీఐ తెలిపారు.
చికిత్స పొందుతూమహిళ మృతి
భీమవరం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు భీమవరం వన్టౌన్ పోలీసులు బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 24వ తేదీన వీరవాసరం మండలం పంజావేమవరం గ్రామానికి చెందిన కొడమంచిలి మేరి(35) భర్తతో కలిసి మోటారు సైకిల్పై భీమవరం వస్తుండగా పోలీసుబొమ్మ సెంటర్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో మేరి తీవ్రంగా గాయపడగా గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. వన్టౌన్ ఎస్సై ఎస్వీవీఎస్ కృష్ణాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

విద్యుత్ షాక్తో యువకుడి మృతి