మళ్లీ జగనన్న పాలన రావాలని.. | - | Sakshi
Sakshi News home page

మళ్లీ జగనన్న పాలన రావాలని..

May 11 2025 7:37 AM | Updated on May 11 2025 7:37 AM

మళ్లీ

మళ్లీ జగనన్న పాలన రావాలని..

జంగారెడ్డిగూడెం: మళ్లీ జగనన్న పాలన వచ్చి పేదల మోముల్లో చిరునవ్వు నిలవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డి రావాలని కోరుకుంటూ శనివారం ఆమె ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించి పూజలు చేయించారు. దక్షిణా ముఖంగా ఉన్న శ్రీవారి మెట్లకు బొట్లు పెట్టుకుంటూ ఆలయానికి చేరుకుని, ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమం అందక పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎటువంటి అభివృద్ధి, సంక్షేమం కానరాకపోగా, ఆర్భాటాలు, ప్రచారాలు, హడావుడి కనిపిస్తున్నాయన్నారు. కూటమి పాలన నుంచి విముక్తి కలిగి మళ్లీ జగనన్న రాజ్యం రావాలని ఆమె ఆకాక్షించారు.

మళ్లీ జగనన్న పాలన రావాలని.. 1
1/1

మళ్లీ జగనన్న పాలన రావాలని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement