కూటమి దౌర్జన్యకాండ | - | Sakshi
Sakshi News home page

కూటమి దౌర్జన్యకాండ

Mar 28 2025 12:45 AM | Updated on Mar 28 2025 12:45 AM

కూటమి

కూటమి దౌర్జన్యకాండ

ఎంపీపీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను అధికార టీడీపీ తుంగలోకి తొక్కింది. వైఎస్సార్‌సీపీకి ఏకపక్షం కావాల్సిన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవుల్లో పాగా వేయాలని చూసింది. పచ్చమూకల్ని ఉసిగొల్పి ఎన్నికలను అడ్డుకుంది. అత్తిలిలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను నిర్బంధించగా యలమంచిలిలో కోరం సరిపోయినా పొంతన లేని కారణాలతో ఎన్నికలు వాయిదా వేశారు. కై కలూరులో అల్లరి మూకలు రెచ్చిపోయాయి.

శురకవారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2025

యలమంచిలిలో హైడ్రామా

యలమంచిలి మండలంలో హైడ్రామా నడుమ ఎన్నిక వాయిదా పడింది. 17 మంది ఎంపీటీసీలకు 13 మంది వైస్సార్‌సీపీ, నలుగురు కూటమి సభ్యులు ఉన్నారు. గురువారం నాటి ఎంపీపీ ఎన్నికకు పూర్తిస్థాయిలో సభ్యులు హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ ఎంపీపీ ఎన్నిక లాంఛనమేనని అంతా భావించారు. కాగా తమకు ఓటెయ్యాలని వైఎస్సార్‌సీపీ నాయకుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నట్టు కూటమి సభ్యులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం, అధికారులు ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేయడం గమనార్హం. వాస్తవానికి వైఎస్సార్‌సీపీ పూర్తి సంఖ్యా బలం ఉండటంతో ఎన్నిక జరిగితే తమకు పదవి రాకుండా పోతుందన్న ఉద్దేశంతో టీడీపీ అధికార బలంతో ఎన్నికను వాయిదా వేయించిందని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ విమర్శించారు.

కై కలూరులో అరాచకం

కై కలూరులో వైస్‌ ఎంపీపీ ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకానికి తెగబడ్డారు. 20 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ, కూటమికి సమాన బలం ఉంది. వైఎస్సార్‌సీపీకి చెందిన భుజబలపట్నం ఎంపీటీసీ సభ్యుడు పెన్మత్స సూర్యనారాయణరాజును ఎన్నికకు హాజరుకాకుండా కూటమి నేతలు అడ్డుకున్నారు. కూటమి నేతల ఆగడాలను కవరేజీ చేస్తున్న భవ్య న్యూస్‌ ఎడిటర్‌ కురేళ్ల కిషోర్‌ను కూటమి నేతలు చితకబాదడంతో గాయలపాలై కై కలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీని రాకుండా అడ్డుకోవడంతో నియోజకవర్గ ఇన్‌చార్జి దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్‌) మీడియా ముఖంగా నిరశన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీలు ఎవరూ హాజరుకాలేదు. కూటమి పార్టీకి చెందిన 9 మంది మాత్రమే హాజరుకావడవంతో కోరం లేక ఎన్నికను శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏలూరు ఆర్డీఓ అచ్చుత అంబరీష్‌ వాయిదా వేశారు.

సాక్షి, భీమవరం/ తణుకు అర్బన్‌/ అత్తిలి/ కై కలూరు: తణుకు నియోజకవర్గ చరిత్రలో మనుపెన్నడూ లేనివిధంగా అత్తిలి ఎంపీపీ ఎన్నికల్లో కూటమి మూకలు రెచ్చిపోయారు. అత్తిలిలో 20 ఎంపీటీసీ స్థానాలకు గాను గత ఎన్నికల్లో 16 చోట్ల వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన చెరో రెండు చోట్ల గెలుపొందాయి. ఇటీవల మాజీ ఎంపీపీ, మరో సభ్యుడు కూటమి పంచన చేరగా, ఒక సభ్యురాలు గల్ఫ్‌ వెళ్లడంతో వైఎస్సార్‌సీపీ సంఖ్యాబలం 13, కూటమి సభ్యులు ఆరుగురు అయ్యారు. ఐదుగురు ఎంపీటీసీ సభ్యులను తమ వైపు లాక్కుని ఎంపీపీ పదవి కాజేయాలని ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఎన్నో ప్రయత్నాలు చేసినా వైఎస్సార్‌సీపీ సభ్యులు లొంగలేదు. చివరకు కాబోయే ఎంపీపీ రంభ సుజాతకు చెందిన పెట్రోల్‌ బంకులపై విజిలెన్స్‌ అధికారులతో దాడులు చేయించినా ఫలితం లేకపోవడంతో ఎన్నిక జరుగకుండా అడ్డుకునే ఎత్తుగడ వేశారు.

కవ్వించి.. చుట్టుముట్టి..

అత్తిలిలోని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం నుంచి గురువారం ఉదయం 13 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్‌ కార్యాలయానికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. వారిని అడ్డుకునేందుకు అప్పటికే అధిక సంఖ్యలో కూటమి శ్రేణులు కారుమూరి నివాసాన్ని చుట్టుముట్టారు. రోడ్డుపై మోటారు సైకిళ్లు అడ్డంగా పెట్టి గొడవకు దిగారు. ఒక దశలో గేట్లు తోసుకుంటూ లోపలకు వచ్చేందుకు ప్రయత్నించడంతో ఎంపీటీసీ సభ్యులు భయాందోళనలతో తలుపులు వేసుకుని లోపలే ఉండిపోయారు. పచ్చమూకలు కవ్వింపు చర్యలకు పాల్పడినా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటిస్తూ వచ్చారు. ఉదయం 8 గంటలకు మొదలైన ముట్టడి ఎన్నిక సమయం ముగిసే వరకు కొనసాగింది. 12 గంటల తర్వాత ఎన్నిక శుక్రవారం నాటికి వాయిదా పడినట్టు సమాచారం వచ్చాక పచ్చమూకలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మండుటెండలోనే కారుమూరి

ఎవరొస్తారో రండంటూ మాజీ మంత్రి కారుమూరి పచ్చమూకలకు ఎదురుతిరిగారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ఎక్కడికి కదలకుండా వారు ఉన్నంతసేపు దాదాపు నాలుగు గంటల పాటు ఇంటి ఎదురుగానే కూర్చుండిపోయారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌ ఆయన వెంట ఉన్నారు.

పోలీసుల ‘పచ్చ’పాతం

అత్తిలిలో దాదాపు వంద మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేసిన అధికారులు దాదాపు అందరినీ మండల పరిషత్‌ కార్యాలయం వద్దనే మోహరించారు. తమ ఎంపీటీసీ సభ్యులకు రక్షణ కల్పించాలని పలుమార్లు వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులను కోరినా వారు స్పందించలేదు. కూట మి శ్రేణుల కారుమూరి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల సృష్టిస్తున్నా చేష్టలుడిగి చూశారే తప్ప ఆపే ప్రయత్నం చేయలేదు. మీడియా ప్రతినిధులు సైతం పలుమార్లు సమస్యను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా వస్తున్నామంటూ ఎన్నికల సమయం ముగిసే వరకూ కాలం గడిపేశారు. మాజీ మంత్రి కారుమూరి సమస్యను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. లా అండ్‌ ఆర్డర్‌ విధులను పక్కనపెట్టి కూటమి నాయకులు చెప్పినట్టుగా పోలీసుల వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుల తరఫున మండల పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు విప్‌ ఎకనాల్జెడ్‌మెంట్‌ను అందజేసేందుకు వెళ్లిన పార్టీ రాష్ట్ర నేత వడ్లూరు సీతారామ్‌ను పోలీసులు అడ్డుకుని బయటకు నెట్టేశారు.

ఎన్నికల ప్రక్రియను కవరేజీ కోసం వచ్చిన సాక్షి టీవీ చానల్‌ కెమెరాను కూటమి నాయకులు లాక్కుని వైర్లు తెంపివేశారు. వీడియో చిత్రీకరిస్తున్న వారిపై వాటర్‌ ప్యాకెట్లను విసిరారు.

న్యూస్‌రీల్‌

ప్రజాస్వామ్యం ఖూనీ

ఎంపీపీ పదవుల కోసం టీడీపీ చిల్లర రాజకీయాలు

అత్తిలిలో మాజీ మంత్రి కారుమూరి ఇంటిని చుట్టుముట్టిన పచ్చమూకలు

వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు ఎన్నికకు హాజరు కాకుండా అడ్డగింత

ఫిర్యాదుచేసినా పట్టించుకోని పోలీసులు

యలమంచిలిలో కోరం సరిపోయినా ఎన్నిక వాయిదా

కై కలూరు వైస్‌ ఎంపీపీ ఎన్నికలో ఉద్రిక్తత

కూటమి దౌర్జన్యకాండ 1
1/5

కూటమి దౌర్జన్యకాండ

కూటమి దౌర్జన్యకాండ 2
2/5

కూటమి దౌర్జన్యకాండ

కూటమి దౌర్జన్యకాండ 3
3/5

కూటమి దౌర్జన్యకాండ

కూటమి దౌర్జన్యకాండ 4
4/5

కూటమి దౌర్జన్యకాండ

కూటమి దౌర్జన్యకాండ 5
5/5

కూటమి దౌర్జన్యకాండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement