
గోగులమ్మకు వెండి కిరీటం సమర్పణ
రాజానగరం: స్థానిక రావుల చెరువు గట్టున కొలువైవున్న గోగులమ్మకు వెండి కిరీటాన్ని భక్తులు శుక్రవారం సమర్పించారు. రాజానగరంతోపాటు పలుప్రాంతాలకు చెందిన భక్తులంతా కలసి సుమారు రూ.4 లక్షలు విలువ చేసే 4 కిలోల బరువు ఉన్న ఈ కిరీటాన్ని శనివారం జరిగే తిరునాళ్లను పురస్కరించుకుని అమ్మవారికి కానుకగా సమర్పించారు. శని, ఆదివారాలలో ఇక్కడ గోగులమ్మ వారి జాతర, తిరునాళ్లు, వీరభద్ర స్వామి సంబరాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మెగా డీఎస్సీ ప్రారంభం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మెగా డీఎస్సీ పరీక్ష జిల్లాలో శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. రాజమహేంద్రవరం లూధర్గిరిలోని రాజీవ్గాంధీ కళాశాల ఐయాన్ డిజిటల్ జోన్లో ఈ పరీక్షలు జరిగాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన మొదటి సెషన్కు 600 మంది అభ్యర్థులు హాజరుకావాల్సివుంది. అయితే 532 మంది పరీక్షలు రాశారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగి సెషన్కు 600 మంది హాజరుకావాల్సివుండగా 527 మంది పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ పి.ప్రశాంతి పరిశీలించారు. ఏర్పాట్లపై జిల్లా విద్యాశాఖాదికారి కె.వాసుదేవరావును అడిగి తెలుసుకున్నారు.
12 వరకు వ్యవసాయ
ఉత్పత్తులు పెంచేందుకు కృషి
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్) ఆధ్వర్యంలో వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున వికసిత్ కృషి కార్యక్రమంలో భాగంగా ప్రీ ఖరీఫ్ ప్రచారాన్ని గత నెల 29 నుంచి ఈనెల 12వతేదీ వరకు చేపడుతున్నామని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ(నిర్కా) డైరెక్టర్ డా.మాగంటి శేషుమాధవ్ అన్నారు. శుక్రవారం ఐకార్–నిర్కా( సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాస్త్రవేత్తలు 2,000కు పైగా జట్లుగా ఏర్పడి ప్రతీరోజు గ్రామాలను సందర్శిస్తూ, కార్యక్రమం ఖరీఫ్ సీజన్లో రైతుల ఆదాయాన్ని పెంచడానికి, స్థిరమైన వ్యవసాయం చేయడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయన్నారు. వికసిత్ కృషి ప్రోగ్రామ్ నోడల్ సైంటిస్ట్ డా.వై.సుబ్బయ్య పాల్గొన్నారు.
వనదుర్గమ్మకు ఘనంగా
చండీహోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఘనంగా చండీ హోమం నిర్వహించారు. సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి, కొండ దిగువన తొలిపావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారికి పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు పండితులు వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చండీ హోమం ప్రారంభించారు. హోమం అనంతరం 11 గంటలకు హోమగుండంలో ద్రవ్యాలను సమర్పించి ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. తరువాత అమ్మవార్లకు పండితులు వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు, నైవేద్యం సమర్పించారు. వనదుర్గ అమ్మవారికి నిర్వహించిన హోమంలో 40 మంది భక్తులు పాల్గొన్నారు. సత్యదేవుని ప్రధానాలయంలో దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు ఇంద్రగంటి నర్శింహమూర్తి ఆధ్వర్యంలో, కనకదుర్గకు అర్చకుడు హరగోపాల్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.

గోగులమ్మకు వెండి కిరీటం సమర్పణ

గోగులమ్మకు వెండి కిరీటం సమర్పణ