అయినవిల్లికి భక్తుల తాకిడి | - | Sakshi
Sakshi News home page

అయినవిల్లికి భక్తుల తాకిడి

May 5 2025 8:34 AM | Updated on May 5 2025 8:34 AM

అయినవిల్లికి భక్తుల తాకిడి

అయినవిల్లికి భక్తుల తాకిడి

అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. అర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. స్వామికి మహానివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు విశేష సేవలు చేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 44 మంది, లక్ష్మీగణపతి హోమంలో 17 జంటలు, స్వామివారి పంచామృతాభిషేకాల్లో నలుగురు దంపతులు పూజలు చేశారు. స్వామివారి గరిక పూజలో ఒక జంట పాల్గొంది. ఐదు జంటలు స్వామికి ఉండ్రాళ్ల పూజ చేశారు. స్వామి వారి సన్నిధిలో 13 మంది చిన్నారులకు అక్షరభ్యాసం, నలుగురికి తులాభారం, ఒకరికి నామకరణ, ఏడుగురు చిన్నారులకు అన్నప్రాశన నిర్వహించారు. 37 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 2400 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాలు ద్వారా రూ.1,98,976 ఆదాయం లభించినట్లు ఈఓ, అసిస్టెంట్‌ కమిషనర్‌ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement