
9 కిలోల గంజాయి స్వాధీనం
నలుగురి అరెస్టు
ముమ్మిడివరం/ఐ.పోలవరం: సర్కిల్ పరిధిలోని ఐ.పోలవరం మండలం మురమళ్ల పుష్కర ఘాట్ వద్ద తొమ్మిది కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని నలుగురు యువకులను అరెస్టు చేశారు. సీఐ ఎం.మోహన్కుమార్ ముమ్మిడివరంలో విలేకరులతో మాట్లాడుతూ మురమళ్ల పుష్కర ఘాట్ వద్ద ఐదుగురు యువకులు గంజాయి కలిగి ఉన్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు చేశామని, వారిలో నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి 9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వారిలో ముగ్గురు పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్టు సీఐ తెలిపారు. సీఐ ఆధ్వర్యంలో ఐ.పోలవరం ఎస్సై ఎంవీవీ రవీంద్రబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.