వాడవాడలూ వాడపల్లివైపే.. | - | Sakshi
Sakshi News home page

వాడవాడలూ వాడపల్లివైపే..

Mar 16 2025 12:06 AM | Updated on Mar 16 2025 12:06 AM

వాడవా

వాడవాడలూ వాడపల్లివైపే..

కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రానికి అత్యధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. పావన గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, భారీ క్యూ లైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించే భక్తులతో ఆలయ ప్రాంగణం పోటెత్తింది. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సుప్రభాత సేవతో సేవలు ప్రారంభించగా భక్తులు స్వామివారిని దర్శించి అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూలర్లు ఏర్పాటు చేశారు. శనివారం స్వామివారికి వివిధ రూపాల్లో రూ. 42,59,486 ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు. సీఐ సీహెచ్‌ విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ నియంత్రించి, శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి బస్సు సర్వీసులను నడిపింది.

అప్పనపల్లిలో భక్తుల కోలాహలం

మామిడికుదురు: పవిత్ర వైనతేయ గోదావరి తీరంలోని అప్పనపల్లి బాల బాలాజీ స్వామి క్షేత్రానికి శనివారం భారీగా భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ, తొలి హారతితో ఆలయంలో దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తులు ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షణలు చేశారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.2,08,980 ఆదాయం వచ్చింది. స్వామి వారి నిత్య అన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.59,926 విరాళంగా అందించారు. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.41,205 ఆదాయం వచ్చింది. స్వామి వారిని నాలుగు వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 2,500 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారని ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు.

గోవింద నామాలతో మార్మోగిన ఆలయం

ఆలయానికి పోటెత్తిన భక్తజనం

శనివారం ఆదాయం రూ.42.59 లక్షలు

వాడవాడలూ వాడపల్లివైపే.. 1
1/1

వాడవాడలూ వాడపల్లివైపే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement