Mahabubnagar: ఒకే ఇంట్లో వివాహిత, యువకుడి ఆత్మహత్యాయత్నం 

Married Woman And Young Man Commits Suicide In Mahabubnagar - Sakshi

ఆస్పత్రికి తరలిస్తుండగా వివాహిత మృతి

యువకుడి పరిస్థితి విషమం

సాక్షి,దేవరకద్ర(మహబూబ్‌నగర్‌): ఓ వివాహిత, మరో యువకుడు ఒకే ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని గోపన్‌పల్లిలో సోమవారం చోటుచేసుకుంది. అనంతరం మహిళ మృతిచెందగా.. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్‌ఐ భగవంత్‌ రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా.. గోపన్‌పల్లికి చెందిన ఆంజనేయులుకి మరికల్‌ మండలం ఎక్లాస్‌పూర్‌ గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహమైంది. వారికి సంతానం కలగకపోవడంతో సదరు మహిళ చెల్లెలు అయిన అక్షిత(25)ను నాలుగేళ్ల క్రితం ఆంజనేయులు రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉండగా.. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి.
చదవండి: టీలో నిద్రమాత్ర వేసి.. మత్తులోకి వెళ్లగానే అత్యాచారం

ఇదిలాఉండగా, సోమవారం అదే గ్రామానికి చెందిన యువకుడు మధు, వివాహిత అయిన అక్షిత ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇంతలోనే కుటుంబసభ్యులు గమనించి.. స్థానికుల సహాయంతో ఇద్దరిని చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అక్షిత మృతిచెందింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్‌ఐ తెలిపారు.
చదవండి: అనుమానం.. చిత్రహింసలు.. నదిలో దూకి తల్లీ, బిడ్డ ఆత్మహత్య    
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top