పుట్టింట్లో ఇల్లాలు.. ఫ్రిజ్‌లో ప్రియురాలు | Horrible Incident at Vizag, Check Full Details | Sakshi
Sakshi News home page

విశాఖలో దారుణం.. ప్రియురాల్ని హత్య చేసి.. ఆమె శరీర భాగాల్ని ఫ్రిజ్‌లో దాచేసి

Mar 30 2026 7:07 AM | Updated on Mar 30 2026 8:23 AM

Horrible Incident at Vizag, Check Full Details

విశాఖ: ప్రశాంతమైన విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. డబ్బు కోసం నిత్యం వేధింపులు చేస్తుండడంతో విసిగి, తన ప్రియురాల్ని హత్య చేసి ఆపై ఆమె శరీర భాగాల్ని ఫ్రిజ్‌లో దాచేశాడు నిందితుడు చింతాడ రవీంద్ర (35). ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది.

పోలీసుల వివరాల మేరకు..విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర(35) విశాఖలోని ఎల్‌.వి.నగర్‌లో నివాసం ఉంటున్నాడు. నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. రవీంద్ర భార్య నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది.

ఈ క్రమంలో తన స్నేహితురాలు మౌనిక(29)ను ఇంటికి పిలిపించుకున్న రవీంద్ర ఆమెను దారుణంగా హతమార్చాడు. శరీర భాగాలను ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టాడు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు.

నిందితుడు ఇచ్చిన సమాచారంతో రవీంద్ర ప్లాట్‌కు వెళ్లిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మౌనిక శరీర భాగాలను ఫ్రిజ్‌లో గుర్తించారు. కానీ ఆమె తలభాగం కనిపించకపోవడంతో సోదాలు చేపడుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు అతడిని వెంటబెట్టుకొని ఘటనా స్థలానికి తీసుకెళ్లి ఫ్రిజ్‌లో రెండు మూటల్లో ఉన్న శరీర భాగాలను గుర్తించారు. తలభాగం కనిపించలేదని సమాచారం. తనను ఆ యువతి డబ్బుల కోసం వేధించిందని, ఆ హింస భరించలేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement