వివాహం చేసుకుంటానని మహిళను నమ్మించి.. | Case Filed On Ar Constable For Woman Molestation Visakhapatnam | Sakshi
Sakshi News home page

వివాహం చేసుకుంటానని మహిళను నమ్మించి

Jan 25 2022 9:24 AM | Updated on Jan 25 2022 10:21 AM

Case Filed On Ar Constable For Woman Molestation Visakhapatnam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పోలీసుల అదుపులో నిందితుడు  
అల్లిపురం (విశాఖ దక్షిణ): వివాహం చేసుకుంటానని మహిళను నమ్మించి మోసం చేసిన రూరల్‌ ఏఆర్‌ స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌ను మహారాణిపేట పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సీఐ జి.సోమశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం... దండుబజార్‌ దరి బీఎస్‌ఎన్‌ఎల్‌ క్వార్టర్స్‌లో నివసిస్తున్న గొంతు మణిమాల అనే మహిళకు 2011లో వివాహమైంది. 2016లో ఆమె భర్త మృతి చెందాడు. వారికి పిల్లలు లేకపోవడంతో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తుంది. ఈ క్రమంలో ఆమెతోపాటు పదో తరగతి చదువుకున్న వ్యక్తి, వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన ఏఆర్‌ రూరల్‌ స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్‌ రెహమాన్‌ పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక్కటయ్యారు. ఈ క్రమంలో శారీరకంగా దగ్గరై రెండుసార్లు అబార్షన్లు కూడా చేయించాడు. తీరా పెళ్లి చేసుకోమని ఆమె కోరడంతో ముఖం చాటేశాడు. కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మణిమాల మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో ఆమె పరిస్థితి విషమించడంతో ఓ ఆస్పత్రికి తరలించారు. మహారాణిపేట పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement