పాత కక్షలతో 108 ఉద్యోగిపై దాడి | - | Sakshi
Sakshi News home page

పాత కక్షలతో 108 ఉద్యోగిపై దాడి

Jun 25 2025 6:45 AM | Updated on Jun 25 2025 11:19 AM

వి.కోట : పాత కక్షల తో ఓ వ్యక్తిపై పలు వురు దాడి చేసిన ఘటన మండలంలోని చింతమాకులపల్లె పంచాయతీ కాంచిమట్లపల్లెలో మంగళవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన నాగరాజు(35) 108లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు లక్ష్మీపతి, గణేష్‌, గంగులప్ప, కుమార్‌, సుధాకర్‌ , వి,కోటకు చెందిన అశోక్‌ కలసి మంగళవారం రాత్రి ఇంట్లో ఉన్న నాగరాజుపై మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. 

దీంతో నాగరాజు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబీకులు హుటాహుటిన 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాలుగేళ్ల క్రితం వారితో నాగరాజు గొడవ పడిన నేపథ్యంలోనే ప్రస్తుతం దాడి చేశారని కుటుంబీకులు ఆరోపించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 29 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 84,179 మంది స్వామివారిని దర్శించుకోగా 33,036 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.72 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని, కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని టీటీడీ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement