మామిడి రైతుకు కూటమి వెన్నుపోటు | - | Sakshi
Sakshi News home page

మామిడి రైతుకు కూటమి వెన్నుపోటు

Jun 25 2025 6:44 AM | Updated on Jun 25 2025 6:44 AM

మామిడ

మామిడి రైతుకు కూటమి వెన్నుపోటు

ప్రశ్నిస్తే కేసులా?

బంగారుపాళెం: ‘కూటమి ప్రభుత్వం మామిడి రైతునూ వదల్లేదు. ఆర్భాటంగా మద్దతు ధర ప్రకటించి చేతులు పైకెత్తేశారు. దిగుబడి వచ్చినా.. మద్దతు ధరలేక.. రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఫ్యాక్టరీల ఎదుట రోజుల తరబడి తిండీతిప్పలు లేక అల్లాడాల్సి వస్తోంది..’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సునీల్‌కుమార్‌ ధ్వజమెత్తారు. కిలో మామిడికి రూ.12 లెక్కన మద్దతు ధర ప్రకటించి అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ మంగళవారం బంగారుపాళెంలోని మామిడి మార్కెట్‌ వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. స్థానిక గ్రామీణ బ్యాంక్‌ వద్ద నుంచి జాతీయ రహదారి మీదుగా మామిడి మార్కెట్‌ వరకు ప్లకార్డులు చేతబట్టి ర్యాలీ చేపట్టారు. అనంతరం మామిడి రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. మామిడి మార్కెట్‌యార్డు ప్రధాన గేట్‌ వద్ద బైఠాయించి కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

మద్దతు ధర అమలులో అంతులేని నిర్లక్ష్యం

బంగారుపాళెం మామిడి మార్కెట్‌ యార్డ్‌ వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణుల ధర్నా

ప్రభుత్వం ప్రకటించిన ధరను అమలు చేయాలని డిమాండ్‌

ఈ సందర్భంగా సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో తోతాపురి రకం మామిడికి గిట్టుబాటుధర లభించక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. తోతాపురి కిలో రూ.12 కు కొనుగోలు చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించినా ఎక్కడా అమలు కావడం లేదని తెలిపారు. జ్యూస్‌ ఫ్యాక్టరీల వద్ద టోకన్ల కోసం పడరాని పాట్లు పడి కాయలు కోసి తరలిస్తే రోజుల తరబడి తిండిలేక అవస్థలు పడాల్సి వస్తోందని వాపోయారు. వ్యాపారులు, జ్యూస్‌ ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్‌గా మారి రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తోతాపురి కిలో రూ.2కు కొనుగోలు చేయడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయాందోళనకు గురిచేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అమరావతి, వైస్‌ ఎంపీపీ శిరీష్‌రెడ్డి, బంగారుపాళెం, తవణంపల్లె, ఐరాల, పూతలపట్టు, యాదమరి మండలాల కన్వీనర్లు రామచంద్రారెడ్డి, హరిరెడ్డి, బుజ్జిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, జిల్లా మహిళా కార్యదర్శి గోహతిసుబ్బారెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, జిల్లా పార్టీ కార్యదర్శి ప్రకాష్‌రెడ్డి, సీనియర్‌ నాయకుడు థామస్‌, మాజీ సింగిల్‌ విండో చైర్మన్‌ దత్తాత్రేయరెడ్డి, జిల్లా సేవాదళ్‌ అధ్యక్షుడు కిషోర్‌కుమార్‌రెడ్డి, మండల రైతు విభాగం అధ్యక్షుడు అరుణామల్‌రెడ్డి, మండల యూత్‌ అధ్యక్షుడు గజేంద్ర, ఎస్సీ, బీసీ, మైనారిటీ సెల్‌ మండల అధ్యక్షుడు నాగరాజ, మొగిలీశ్వర్‌, షాకీర్‌, వాణిజ్య విభాగం మండల అధ్యక్షుడు విజయకుమార్‌, బూత్‌ కమిటీ అధ్యక్షుడు భానుప్రకాష్‌రెడ్డి, సోషియల్‌మీడియా వింగ్‌ అధ్యక్షడు శైలేష్‌, మణిరాజ్‌, నియోజకవర్గ పరిధిలోని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

మామిడి రైతుకు కూటమి వెన్నుపోటు1
1/2

మామిడి రైతుకు కూటమి వెన్నుపోటు

మామిడి రైతుకు కూటమి వెన్నుపోటు2
2/2

మామిడి రైతుకు కూటమి వెన్నుపోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement