
హెడ్ కానిస్టేబుల్పై కేసు
పుత్తూరు: గత ఏడాది మే 13న జరిగిన అసెంబ్లీ, లోకసభ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న వివాదంపై కోర్టు ఆదేశాల మేరకు పుత్తూరు హెడ్ కానిస్టేబుల్పై శుక్రవారం రాత్రి పోలీసు కేసు నమోదైంది. సీఐ సురేంద్రనాయుడు కథనం మేరకు.. పుత్తూరు పట్టణానికి చెందిన కె.మురగారెడ్డి(59) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుత్తూరు అర్బన్ పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ జి.మాధవ (హెచ్.సి.2727)పై పుత్తూరు జుడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. మురగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో గత ఏడాది మే 13వ తేదీన తాను ఓటు వేయడానికి తిమ్మాపురంలోని పోలింగ్ బూత్ నం.40 వద్దకు వెళ్లిన సమయంలో మొబైల్ పార్టీ ఇన్చార్జ్ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మాధవ తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరిస్తూ, దౌర్జన్యానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులోని అంశాలు కేసు నమోదు చేయలేని (నాన్–కాగ్నిజబుల్) స్వభావం కలిగి ఉన్నందున స్థానిక జేఎఫ్సీఎం కోర్టు అనుమతితో ఏఎస్ఐ పొన్నుస్వామి కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును పుత్తూరు డీఎస్పీ ఆదేశాల మేరకు మరో స్టేసన్కు బదిలీ చేసే అవకాశం ఉంది.