రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

Jun 23 2025 5:42 AM | Updated on Jun 23 2025 5:42 AM

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

పుంగనూరు (చౌడేపల్లె) : రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సాగుచేసిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదని మాజీ మంత్రి , ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఆయన పర్యటించిన అనంతరం పుంగనూరులో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం చాలా బాధాకరమన్నారు. రైతు భరోసా కేంద్రాలన్నీ మరుగున పడేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి రైతులకు గిట్టుబాటు ధరలు లేక నష్టపోయారన్నారు. అలాగే పత్తి, మిర్చి, పొగాకు, షుగర్‌కెన్‌ (చెరకు) పంటలు సాగుచేసిన రైతులు, చిత్తూరు జిల్లాలో కోట్లు ఖర్చుపెట్టి సాగుచేసిన టమాట రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పల్ప్‌ ప్యాక్టరీ కూడా మ్యాంగో తోతాపూరి కొనే పరిస్థితి లేదన్నారు. కొద్దో గొప్పో కొనుగోలు చేసినా రూ.2 నుంచి రూ.3కు కొనుగోలు చేస్తే రైతు ఏ విధంగా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేరుకు మాత్రం రూ.8 ఇచ్చి కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీలకు చెప్పడం, ప్రభుత్వం ఏమో రూ.4 సబ్సిడీ ఇస్తామని చెబితే రూ.12 గిట్టుబాటు ధర అవుతుందని అనుకుంటే బూటకపు మాటలు చెప్పి రైతుల నుంచి కేవలం రూ.2 నుంచి రూ.3కు కొనుగోలు చేయడం పరిస్థితి దురదృష్టకరమన్నారు. చంద్రబాబు హయాంలో రైతులకు తీరని అన్యాయం జరిందన్నారు.

ప్రతిపక్ష నేత వెళ్లకుండా అడ్డంకులు

రెతులను పలకరించడానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి వెళ్తుంటే రకరకాల అడ్డంకులు, కేసులు పెట్టడం, రైతులను, పార్టీ నేతలను వేధించడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వంలో టమాటాకు ధరలు లేని సమయంలో గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసి రైతులను ఆదుకొన్న ఘటనను గుర్తుచేశారు. ఇప్పుడు టమాటా, మామిడి కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. నాలుగేళ్ల పాటు రైతులందరూ క్రాప్‌ హాలిడే ప్రకటించి సెలవుల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎంపీ ఎన్‌.రెడ్డెప్ప, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నాగభూషణం, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఆలీం బాషా, నాయకులు ఫకృద్దీన్‌ షరీఫ్‌, రాజేష్‌,హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.

నాలుగేళ్లు రైతులకు క్రాప్‌ హాలీడేనే

చంద్రబాబుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement