యువతను నమ్మించి వంచించింది | - | Sakshi
Sakshi News home page

యువతను నమ్మించి వంచించింది

Jun 23 2025 5:42 AM | Updated on Jun 23 2025 5:42 AM

యువతన

యువతను నమ్మించి వంచించింది

సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. నిరుద్యోగ భృతి, జాబ్‌ క్యాలెండర్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు, ఉద్యోగాల కల్పనలో ఏ మాత్రం చిత్తశుద్ధి చూపించలేదు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినా ఇంత వరకు యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ యువజన రాష్ట్ర విభాగం యువత పోరుకు పిలుపునిచ్చింది. సోమవారం ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకు చర్యలు చేపట్టాం. యువత అధిక సంఖ్యలో హాజరై తమ గళాన్ని వినిపించాలి.

– హేమంత్‌రెడ్డి, రీజనల్‌ కోఆర్డినేటర్‌, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం

హామీల అమలులో విఫలం

కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందింది. యువతకు ఎన్నికల సమయంలో ఓట్లు దండుకునేందుకు పలు హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాకా యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసగించారు. కూటమి ప్రభుత్వం మోసానికి నిరసనగా నేడు యువత పోరు ర్యాలీ నిర్వహించనున్నాం. డిమాండ్లు పరిష్కరించకపోతో ఆందోళనలు ఉధృతం చేస్తాం.

– మనోజ్‌రెడ్డి, చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు

యువతను నమ్మించి వంచించింది  
1
1/1

యువతను నమ్మించి వంచించింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement