
గ్రానైట్ రాయి పడి..
గుడిపాల: గ్రానైట్ రాయి పడి కాళ్లు నుజ్జునుజ్జు అయిన ఘటన గుడిపాల మండలంలో చోటుచేసుకుంది. గుడిపాల క్రాస్ సమీపంలో ఉన్న రాధిక గ్రానైట్లో అస్సాం రాష్ట్రానికి చెందిన రంజన్వల్లి(32) పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం గ్రానైట్ రాయిని కోసేందుకు మిషన్పై ఎక్కించి తోస్తుండగా అదుపుతప్పి రాయి కాళ్లపై పడింది. దీంతో అతని కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. 108 సిబ్బంది శివ అతన్ని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు.