యోగాతో సంపూర్ణ ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

Jun 22 2025 3:40 AM | Updated on Jun 22 2025 3:40 AM

యోగాత

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

ప్రతి రోజూ యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మెసానికల్‌ మైదానంలో యోగాంధ్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో మే 21 నుంచి జూన్‌ 21 వరకు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జిల్లాలోని పులిగుండు, బోయకొండ, కంగుంది, కాణిపాకం, బోయకొండలో యోగా కార్యక్రమాలు నిర్వహించినట్టు ఆయన గుర్తుచేశారు. ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ నిత్యం యోగా సాధన చేయడం వల్ల అనారోగ్యం నుంచి బయటపడొచ్చన్నారు. అనంతరం యోగా ట్రైనర్స్‌ ఉన్న విశాల్‌, రెడ్డిమస్తాన్‌, రాధిక, సునీత, ప్రేమ్‌సాయి, శ్రీనివాస్‌, బాబుకు మెమెంటో, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ అముద, చుడా చైర్మన్‌ హేమలత, జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి, జిల్లా అటవీశాఖ అధికారి భరణి, డీఆర్‌వో మోహన్‌కుమార్‌, ఆర్డీవో శ్రీనివాసులు, టూరిజం అధికారి గౌరీ, అర్బన్‌ తహసీల్దార్‌ కులశేఖర్‌ పాల్గొన్నారు. – చిత్తూరు కలెక్టరేట్‌

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం 1
1/1

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement