వేతనాలు పెంచాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

వేతనాలు పెంచాలని నిరసన

Jun 22 2025 3:40 AM | Updated on Jun 22 2025 3:40 AM

వేతనా

వేతనాలు పెంచాలని నిరసన

చిత్తూరు అర్బన్‌: మున్సిపల్‌ ఇంజినీరింగ్‌, కార్మికులు జీతాలు పెంచాలని మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ టౌన్‌ ప్లానింగ్‌ అండ్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి రామమూర్తి పేర్కొన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ ఇంజినీరింగ్‌ విభాగం అధ్యక్షుడు యం.శరవణ మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ కార్మికులకు స్కిల్డ్‌ రూ.29,200, సెమీ స్కిల్డ్‌ రూ.24,600 చెల్లించాలన్నారు. మినిమం టైం స్కేల్‌, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలన్నారు. రిటైర్మెంట్‌ వయసు 60 నుంచి 62కు పెంచాలన్నారు. రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ కింద కార్మికులకు గ్రాట్యూటీ రూ.10 లక్షలు మంజూరు చేస్తూ.. కార్మికునికి నెలకు పింఛను రూ.10000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డిఅసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.శరవణ, ప్రధాన కార్యదర్శి డీ.శివకుమార్‌, కోశాధికారి శివప్రసాద్‌, గౌరవ సలహాదారు పీ.వెంకటేష్‌, ఉపాధ్యక్షుడు ఎం.హరికృష్ణ, ఎన్‌.వెంకటేష్‌, జాయింట్‌ సెక్రెటరీ టీ.గోపాలాచారి, ఏ.ఉషా యూనియన్‌ సభ్యులు కే.వీ.సునీల్‌కుమార్‌, డీఎపీ.శంకర్‌, ఎస్‌.పీరుల్లా, ఎం.వేలు, కే.సుజాత పాల్గొన్నారు.

వేతనాలు పెంచాలని నిరసన1
1/1

వేతనాలు పెంచాలని నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement