అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

Jun 21 2025 3:11 AM | Updated on Jun 21 2025 3:11 AM

అప్పు

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

నిండ్ర: అప్పుల బాధతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలో విషాదాన్ని మిగిల్చింది. వివరాలు.. మండలంలోని శ్రీరామపురం పంచాయతీ శ్రీరామాపురం గ్రామానికి చెందిన యవరైతు హేమాద్రి(29) భార్య దీప, కుమారుడు ఉన్నాడు. తనకున్న పొలంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో కొంత వరకు బ్యాంక్‌లోను, ఇతరుల వద్ద అప్పు చేశాడు. ఇలా సుమారు రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. రుణదాతల ఒత్తిళ్లు భరించలేక బుధవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం హేమాద్రి మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఐజర్‌ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా కోహ్లీ

ఏర్పేడు : మండలంలోని జంగాలపల్లి సమీపంలో ఉన్న తిరుపతి ఐజర్‌ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా ఇంద్రప్రీత్‌సింగ్‌ కోహ్లీ నియమితులయ్యారు. విద్యామంత్రిత్వ శాఖ పరిధిలోని ఐజర్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆయనను ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఐజర్‌ పాలనా చట్రాన్ని, సంస్థాగత నైపుణ్యాన్ని మరింత బలోపేతం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

బైక్‌పై నుంచి జారిపడి మహిళ మృతి

చౌడేపల్లె: బైక్‌పై నుంచి జారిపడి మహిళ మృతిచెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం... చారాల పంచాయతీ, జంగాలపల్లెకు చెందిన రాజమ్మ(65) చౌడేపల్లెకు వచ్చింది. ఆమె సమీప బంధువైన శ్రీరాములుతో కలిసి బైక్‌ పై స్వగ్రామానికి వెళ్తుండగా పలమనేరు మార్గంలోని చిట్రెడ్డిపల్లె సమీపంలోని డౌన్‌లో కుక్క ఎదురుగా రావడంతో బైక్‌ అదుపుతప్పింది. ఈ క్రమంలో బైక్‌పై నుంచి రాజమ్మ జారిపడింది. వెంటనే ఆమెను మదనపల్లెలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. కేసు దర్యాప్తులో ఉంది.

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య 
1
1/1

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement