
మామిడి కాయలు అన్లోడ్ చేసి వెళ్తూ..!
బంగారుపాళెం: మండలంలోని కాటప్పగారిపల్లె సమీపంలో చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ట్రాక్టర్ను కారు ఢీ కొన్న ప్రమాదంలో తండ్రి మృతి చెందగా, కుమా రుడు తీవ్రంగా గాయపడ్డాడు. చిత్తూరు రూరల్ మండలం, కొడిగుట్ట గ్రామానికి చెందిన రైతు చంద్రశేఖర్నాయుడు, ఆయన కుమారుడు యుగేష్ మామిడి కాయలను ట్రాక్టర్లో బంగారుపాళెంకు తీసుకొచ్చారు. కాయలను మార్కెట్లో దింపి తిరి గి స్వగ్రామానికి ట్రాక్టర్పై బయలుదేరారు. యుగే ష్ డ్రైవింగ్ చేస్తుండగా, చంద్రశేఖర్నాయుడు పక్కన కూర్చున్నాడు. మార్గమధ్యంలో కాటప్పగారిపల్లె వద్ద ట్రాక్టర్ను పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్నాయుడు (62)పై ట్రాక్ట ర్ ట్రాలీ చాసిన్ పడడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. యుగేష్(32) తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన యుగేష్ను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్నాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాస్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఫ్యాక్టరీలో అన్లోడింగ్ దందా!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని పలు ఫ్యాక్టరీల్లో అన్లోడింగ్ దందా నడుస్తోంది. కొన్ని ఫాక్యరీల్లో లోడ్ దింపే వారికి రూ.50 నుంచి రూ.200 వరకు టీ, కాఫీ ఖర్చుల పేరుతో టిప్పు ఇస్తుంటారు. అప్పోసస్పో చేసి రైతులు కాయలను ఫ్యాక్టరీకి తీసుకొస్తుంటే ట్రాక్టర్ అన్లోడింగ్కు రూ.500 నుంచి రూ.800 వరకు గుంజుకుంటున్నారు. చిత్తూరు మండలం చెర్లోపల్లిలోని హయాత్ ఫుడ్స్లో కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పు మంటున్నాయి. జేసీ విద్యాధరి గురువారం ఫ్యాక్టరీని తనిఖీ చేసినట్లు తెలిసింది. ఫ్యాక్టరీ నిర్వాహకులతో మాట్లాడి పలు సూచనలు చేస్తూ.. వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.