
ముసలిమడుగుకు మరో కుంకీ ఏనుగు
పలమనేరు: మండలంలోని ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపునకు మరో కుంకీ ఏనుగు చేరింది. స్థానిక అటవిశాఖ అధికారులు తిరుపతి జూ నుంచి గనేణ్ అనే కుంకీ ఏనుగును ప్రత్యేక వాహనంణంలో గురువారం ఇక్కడికి తీసుకొచ్చారు. గతంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ప్రాంతం నుంచి నాలుగు కుంకీ ఏనుగులు, ఆపై రామకుప్పం మండలంలోని ననియాల నుంచి రెండు కుంకీ ఏనుగులకు ఇక్కడికి చేరిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు ఇక్కడ ఏడు కంకీ ఏనుగులు క్యాంపులో ఉన్నాయి. కుంకీ ఏనుగుల ద్వారా కౌండిన్యలోని ఏనుగులను అదుపులోకి తీసుకొచ్చి వాటిని అడవిలోంచి పంటపొలాల వైపునకు వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నట్టు స్థానిక అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.