
మామిడి రైతుల ముట్టడి
– సిఫార్సులకు టోకెన్లు ఇస్తున్నారని మండిపాటు
పూతలపట్టు(కాణిపాకం) : పూతలపట్టు మండలం పోలవరంలోని పళ్ల గుజ్జు పరిశ్రమను బుధవారం మామిడి రైతులు ముట్టడించారు. స్థానిక రైతులకు టోకెన్లు ఇవ్వకుండా సిఫార్సులతో టోకెన్లు ఇచ్చేస్తున్నారని ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. సిఫార్సులతో వచ్చే వారికి ఎలా టోకెన్లు ఇస్తారని నిలదీశారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ శ్రీనివాసులు అక్కడికి చేరుకొని ఫ్యాక్టరీ నిర్వాహకులతో మాట్లాడారు. దీంతో వాగ్వివాదం సద్దుమణిగింది. ఈ క్రమంలో మామిడి కాయలు లోడింగ్ చేసుకొచ్చిన ట్రాక్టర్లు క్యూ కట్టాయి.