రాష్ట్రాల మధ్య వివాదాల పురి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రాల మధ్య వివాదాల పురి

Jun 18 2025 3:29 AM | Updated on Jun 18 2025 3:29 AM

రాష్ట

రాష్ట్రాల మధ్య వివాదాల పురి

కర్ణాటకలో ధర ఎక్కువ

మేం ఎన్నో ఏళ్లుగా పట్టు గూళ్లను కర్ణాటకలోని మార్కెట్లకు తీసుకెళుతున్నాం. ఎందుకంటే ఇక్కడి మార్కెట్లలో కంటే అక్కడ కేజీపై రూ.40 నుంచి రూ.50 ఎక్కువగా పలుకుతోంది. ఇక్కడ తక్కువ ధరలకు అమ్మి ప్రభుత్వం ఇచ్చే ఇన్‌సెంటీవ్‌ కంటే అక్కడ అమ్మితే ఎక్కువగా దక్కుతుంది. అందుకే కర్ణాటక మార్కెట్లకు గూళ్లను అమ్ముతున్నాం.

– రెడ్డెప్ప రెడ్డి, పట్టు రైతు, టీఎస్‌ అగ్రహారం, పలమనేరు

కోలారు మార్కెట్‌లో అమ్మేస్తా

నేను ఏటా సీజన్‌తో సంబంధం లేకుండా పదెకరాల్లో టమాటా సాగుచేస్తా. ఎక్కువ పె ట్టుబడి పెట్టి కేవలం హైబ్రిడ్‌ సీడ్స్‌మాత్రమే ఎంచుకుంటా. ఈ సరుకు ఇక్కడి మార్కెట్‌లో ఆశించిన ధరతో అమ్ముడుపోదు. అందుకు క ర్ణాటకలోకి కోలారు టమాటా మార్కెట్‌కు తీ సుకెళ్తాం. అక్కడికి ఇక్కడికి ధరలో వ్యత్యాసం ఉంటుంది.

– గోవిందురెడ్డి, టమాటా రైతు, బేరుపల్లి, పలమనేరు మండలం

జిల్లాలో మామిడి సీజన్‌ నడుస్తున్న నేపథ్యంలో మామిడి ధరలు నిలకడగా ఉండాలని పొరుగు రాష్ట్రాల నుంచి తోతాపురి కాయలు జిల్లాలోకి రాకుండా అధికార యంత్రాంగం ఇప్పటికే ఆంక్షలను విధించింది. ఇటీవల చిత్తూరుకొచ్చిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సైతం పొరుగు రాష్ట్రాలనుంచి మామిడి ఇక్కడికి రాకూడదని దీనిపై గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం గమనార్హం. ఈ విషయం ఇప్పుడు రాష్ట్రాల మధ్య ఇబ్బందికర పరిస్థితులు తెచ్చేలా ఉంది.

పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి సీజన్‌తో సంబంధం లేకుండా పట్టుగూళ్లు కర్ణాటకలోని పలు మార్కెట్లకు ఇక్కడి రైతులు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. అదే విధంగా టమాటాలు అటు కర్ణాటకలోని కోలారు ఇటు తమిళనాడులోని చైన్నై కోయంబేడు మార్కెట్‌కు నిత్యం వెళుతూనే ఉన్నాయి. ఆ రాష్ట్రాలనుంచి జిల్లాలోని గుజ్జు పరిశ్రమలకు వచ్చే తోతాపురిని మనం అడ్డుకుంటే వారు అదే విధంగా కట్టడి చేస్తే ఇక్కడి టమాటా, పట్టుగూళ్ల రైతుల పరిస్థితి ఏంటనే మాట రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.

రాష్ట్రాల మధ్య వివాదాలకు ఆజ్యం?

కర్నాటక, తమిళనాడునుంచి జిల్లాలోకి మామిడి కాయలు రాకుండా ఆంక్షలు విధించారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద రెవెన్యూ యంత్రాంగం కాపాలా కాస్తోంది. దీనికి కారణం జిల్లాలో ఈ దఫా మామిడికి గిట్టుబాటు ధర లేదు. కలెక్టర్‌ చెప్పినా కిలోకు రూ.8 ఇవ్వలేమని గుజ్జుపరిశ్రమల నిర్వాహకులు మొండికేస్తున్నారు. కనీసం రూ.6 కూ కొనడంలేదు. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలనుంచి మామిడి రాకుంటే జిల్లాలోని మామిడికి ధర పెరుగుతుందని అధికారులు ఆంక్షలను పెట్టారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఘాటుగా స్పందించి మన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇది రాష్ట్రాల మధ్య వివాదాలకు దారితీసేలా ఉంది.

మామిడి సీజన్‌ కొన్నాళ్లే

జిల్లాలో 87వేల ఎకరాల్లో మామిడి తోటలుంటే ఏటా సీజన్‌లో 7లక్షల టన్నుల దిగుబడి వస్తున్నట్టు ఉద్యానశాఖ గణాంకాలు చెబుతున్నాయి. మామిడి సీజన్‌ ప్రధానంగా మే నుంచి జూలై ఆఖరుదాకా సాగుతుంది. జిల్లాలో సాగయ్యే మామిడిలో తోతాపురి 55శాతం ఉంది. జిల్లాలో 15కుపైగా గుజ్జుపరిశ్రమలున్నాయి. తోతాపురిని పల్ప్‌ ఫ్యాక్టరీలకు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆ రాష్ట్రాలు వీటిపై మెలిక పెడితే...

చిత్తూరు జిల్లానుంచి పట్టుగూళ్లు, టమాటాలను కర్ణాటకలో కొన మని ఆ రాష్ట్రం ఆంక్షలు పెడితే ఇక్కడి రైతుల పరిస్థితేంటనే మాట వినిపిస్తోంది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం ఇక్కడి టమాటాలను వద్దంటే అప్పుడు టమాటా ధరలు మరింత పతనం కావడం తథ్యం. ఇప్పటికే టమాటా ధరలు తగ్గుముఖం పట్టి జిల్లాలోని రైతులు తీవ్రనష్టాల్లో మునిగిపోయారు. ఇదే పరిస్థితి రేపు పట్టుగూళ్ల రైతులకు వస్తే రైతులకు కష్టాలు మొదలై పొరుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

పొరుగు రాష్ట్రాల తోతాపురిపై కూటమి ఆంక్షలు జిల్లా నుంచి కర్ణాటకకు మన పట్టుగూళ్లు తమిళనాడుకు ఇక్కడి టమాటాలు వెళుతున్నాయి వీటికి ఆ రాష్ట్రాలు అడ్డుకట్ట వేస్తే పరిస్థితేంటి?

రాష్ట్రాల మధ్య వివాదాల పురి1
1/2

రాష్ట్రాల మధ్య వివాదాల పురి

రాష్ట్రాల మధ్య వివాదాల పురి2
2/2

రాష్ట్రాల మధ్య వివాదాల పురి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement