
గుట్టలనే మింగేస్తున్నారు
పాలసముద్రం: మండలంలోని బాలక్రిష్ణాపురం సమీపంలోని గుట్ట నుంచి తమిళనాడు తమిళనాడు రాష్ట్రానికి ఎర్రమట్టి గ్రావెల్ అక్రమంగా తరలిపోతున్నదని గ్రామస్తులు రెవె న్యూ, పోలీస్ యంత్రాంగానికి తెలిపినా ప ట్టించుకోవడం లేదు. మండలంలో ప్రజలు, రైతులు చెరువులో మట్టి, ఇంటి పక్కన ఉన్న గుంతలను పూడ్చేందుకు ట్రాక్టర్లో మట్టి తీసుకెళ్లుతుంటే మాత్రం రెవెన్యూ అధికారులు ట్రాక్టర్, జేసీబీని సీజ్ చేస్తున్నారు. నెల రోజులుగా టిప్పర్లో కొండను తవ్వేస్తుంటే అధికారులు అటువైపు కన్నెత్తి చూసినవారు లేరని రైతులు అంటున్నారు. టిప్పర్లు తమిళనాడువే, పని చేసేవారు కూడా తమిళనాడు వారే. గ్రామస్తులు కొండలోని మట్టిని ఎందుకు తీసుకెళ్లుతున్నారని అడిగితే వారి బెదిరిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లాస్థాయి ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా గుట్టలోని ఎర్రమట్టి రవాణా అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.
పుత్తూరు విద్యార్థి ముంబయిలో ఆత్మహత్య
● మంగళవారం పుత్తూరుకు చేరిన మృతదేహం
పుత్తూరు: ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్), ఎన్ఐఈఎల్టీ ఫలితాలు రద్దయ్యాయన్న మనస్తాపంతో పుత్తూరుకు చెందిన ఓ విద్యార్థి ముంబయిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణానికి చెందిన ఎన్ఎస్ జార్జ్, స్వర్ణలత దంపతులకు శ్రీమధుర్, హాషిక ఇద్దరు సంతానం. కుమారుడు శ్రీమధుర్ బీటెక్ పూర్తి చేసి బ్యాంకు కాంపిటీషన్ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించి ముంబయి ఎస్బీఐలో ఐటీ మేనేజర్గా ఉద్యోగం సంపాదించాడు. అయితే ఎన్ఐసీ, ఎన్ఐఈఎల్టీ పరీక్షలో సత్తా చాటాడు. అహర్నిశలు శ్రమించి 5వ ర్యాంకు సాధించాడు. అయితే ఆ పరీక్ష ఫలితాలను కొన్ని సాంకేతిక కారణాలతో ఈ ఏడాది రద్దు చేశారు. తన లక్ష్యానికి అవరోధంగా నిలిచినందుకు మనస్తాపానికి గురైన శ్రీమధుర్ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలియడంతో అతని తల్లిదండ్రులు, తోబుట్టువు కుప్పకూలిపోయారు. తల్లిదండ్రులు ముంబయికి వెళ్లి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసి, మృతదేహాన్ని తీసుకొని మంగళవారం పుత్తూరుకు చేరుకున్నారు. సాయంత్రం అశ్రునయనాల మధ్య శ్రీమాధుర్ అంత్యక్రియలు ముగించారు. శ్రీమధుర్ తల్లిదండ్రులు మాట్లాడుతూ తన బిడ్డకు జరిగిన అన్యాయం ఏ బిడ్డకూ జరగకూడదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఐసీ పరీక్షల నిర్వాహుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గుట్టలనే మింగేస్తున్నారు