
అల్లుడి అరెస్ట్
పుత్తూరు: పట్టణ పరిధిలో ని కళ్యాణపురం ఎస్టీ కాలనీలో జరిగిన హత్య కేసులో నిందితుడ్ని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సురేంద్రనాయుడు కథ నం మేరకు.. గ్రామానికి చె ందిన చెంచయ్య భార్య ఎన్.నరసమ్మ(53) ఈనెల 4వ తేదీన హత్యకు గురైంది. నరసమ్మ పెద్ద కుమార్తె ఎన్.కళ్యాణిని జీ.మోహన్కు ఇచ్చి 2019లో వివాహం చేసింది. పెద్ద అల్లుడు మోహన్ వివాహం అయినప్పటి నుంచి తాగుడికి బానిసై భార్యాబిడ్డలను పట్టించుకునేవాడు కాదు. దీంతో విసుగు చెందిన కళ్యాణి బిడ్డలతో నెల క్రితం పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో మోహన్ అత్త ఇంటికి వచ్చి తన భార్యను కాపురానికి పంపా లని నరసమ్మను అడిగాడు. వీరి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆవేశానికి లోనైన మోహన్ కర్రతో నరసమ్మ తలపై బలంగా కొట్టాడు. ఆమె కు మార్తె కళ్యాణి తల్లి నరసమ్మను మొదట పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 6వ తేదీన నరసమ్మ మృతి చెందింది. అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు మోహన్ను మంగళవారం తడుకు బస్ స్టాప్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.