
వివాహిత ఆత్మహత్య!
పలమనేరు: మున్సిపాలిటీ పరిధిలో ని గంటావూరు బీసీ కాలనీకి చెందిన విన్సీప్రియ(34) అనే మహిళ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పా ల్పడింది. ఈ ఘటన మంగళవారం పలమనేరులో వెలుగులోకి వచ్చింది. స్థానిక సీఐ నరసింహరాజు తెలిపిన వివరాల మేరకు.. మృతురాలి భర్త పసుపతి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇంట్లో భార్య, ఏడేళ్ల కుమారుడు ఉంటున్నారు. ఇలా ఉండగా డ్యూటీలో భాగంగా విజయవాడలో ఉన్న భర్త సోమవారం రాత్రి భార్యతో మాట్లాడినట్టు సమాచారం. అయితే మంగళవారం పొద్దున నుంచి తన భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె లిప్ట్ చేయలేదు. దీంతో తమ ఇంటి పక్కనున్న వారికి చెప్పగా వారు వెళ్లి చూడగా ఉరేసుకుని ఉండడంతో అదే వీధిలో ఉంటున్న మృతురాలి తల్లికి సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో మృతురాలి కొడుకు అమ్మమ్మవద్దే ఉన్నాడు. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దించి ఆమె భర్తకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు. మరోవైపు స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.