
తహసీల్దార్ బదిలీల్లో అన్యాయం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఇటీవల నిర్వహించిన తహసీల్దార్ బదిలీల్లో వివక్ష జరిగిందని పలువురు బాధిత తహసీల్దార్లు వాపోతున్నారు. బదిలీల్లో ఎస్సీ, ఎస్టీలకు చెందిన రెగ్యులర్ తహసీల్దార్లకు పోస్టింగ్స్ ఇవ్వకుండా అన్యాయం చేశా రని చెబుతున్నారు. రెగ్యులర్ తహసీల్దార్లు జిల్లా లో ఉన్నప్పటికీ పోస్టింగ్లు ఇవ్వకుండా వివక్ష చూపడం బాధాకరమని చెబుతున్నారు. రెగ్యుల ర్ తహసీల్దార్లకు పోస్టింగ్లు ఇవ్వకుండా లూప్లైన్లో పెట్టి అర్హత లేని డిప్యూటీ తహసీల్దార్లకు పోస్టింగ్లు ఇచ్చారని చెబుతున్నారు. క్రమశిక్షణ కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పోస్టింగ్ ఇవ్వడం అ న్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూ టీ తహసీల్దార్లకు కూటమి నాయకుల అండ ఉండటంతో అడ్డదారుల్లో పోస్టింగ్లు ఇచ్చారని చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 7 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ రెగ్యులర్ తహసీల్దార్లు ఎలాంటి అండదండలు లేక సీనియర్లు అయినప్పటికీ పోస్టింగ్లు లేక కలెక్టరేట్లో ఖాళీ కుర్చీలకు పరిమితం అయినట్లు వెల్లడిస్తున్నారు. ఈ సమస్యను కలెక్టర్ పరిశీలించి న్యాయం చేయాలని బాధిత సీనియర్ తహసీల్దార్లు కోరుతున్నారు.
కాణిపాకంలో కమిషనర్
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని ఆదివారం రాష్ట్ర దేవదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. పండితులు ఆశీర్వచనాలు చేశారు. అనంతరం ఈవో పెంచలకిషోర్ స్వామివారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. తొలుత కమిషనర్ పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో, ఈఈతో చర్చించారు. తర్వాత నూతనంగా నిర్మిస్తున్న అన్నదాన భవనం, వినాయక సదన్, గణేష్ సదన్, నిత్యాన్నదాన భవనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఈఈ వెంకటనారాయణ, తిరుపతి దేవదాయశాఖ సహాయ కమిషనర్ రామకృష్ణారెడ్డి, ఏఈఓలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరి మాధవరెడ్డి, ప్రసాద్, ధనంజయ పాల్గొన్నారు.