
అప్పుల బాధతో ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
బంగారుపాళెం: అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళెం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రసాద్ కథనం మేరకు.. మండలంలోని వేపనపల్లెకు చెందిన రవి(52) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై రాగిమానుపెంట గ్రామ సమీపంలోని ఓ మామిడితోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గుర్తించి బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.