
చివరి దశకు అయ్యోర్ల బదిలీలు
ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీలు చివరి దశకు చేరాయి. నేటితో ఈ ప్రక్రియను ముగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025
దాసరపల్లె పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో రోడ్డుపై మురుగు నీరు
కూటమి నేతలు పల్లైపె పగబట్టారు. మౌలిక వసతులు కల్పించకుండా నాన్చుతున్నారు. మెజారిటీ సర్పంచ్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే ఉండడంతో ఆ క్రెడిట్ వారికి ఎక్కడ వెళ్తుందోనని కుట్ర పన్నుతున్నారు. ఇందులో భాగంగానే మూడు నెలల క్రితం విడుదలైన 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు రూ.30.32 కోట్లు ఖర్చుచేయకుండా మోకాలడ్డుతున్నారు. పల్లెల్లో వసతులు కల్పించకుండా జనాలకు చుక్కలు చూపిస్తున్నారు.
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మేజర్, మైనర్ గ్రామ పంచాయతీలన్నీ కలిపి 697 దాకా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గత మార్చి లోనే 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ఖజానాకు జమచేసింది. పల్లెల్లో వసతులు కల్పించేందుకు మొత్తం రూ.30.32 కోట్లు దాకా సర్దుబాటు చేయాల్సి ఉంది. నెలలు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం నిధులు విదల్చకుండా కాలయాపన చేస్తోంది. ఆర్థిక సంఘం నిధులు టైడ్, ఆన్టైడ్ విభాగాలుగా కేటాయిస్తారు. టైడ్ విభాగంలో పారిశుద్ధ్యం, తాగునీటి అవసరాలకు, ఆన్టైడ్ విభాగంలో రోడ్లు, మురుగు కాలువలు, శ్మశాన వాటికల అభివృద్ధి, విద్యుత్ మోటారు మరమ్మతులు, చెత్త సేకరించే కార్మికుల వేతనాల వంటి వాటికి ఖర్చు చేస్తారు. మేజర్ పంచాయతీలకు ఇంటి పన్నులు, చేపల చెరువుల వేలం, వారపు సంతలు, కాలువ గట్లు, ఏటిగట్ల పై కొబ్బరి చెట్ల ఫలసాయం ద్వారా వచ్చే ఆదాయం వంటివి ఉంటాయి. వీటితో పాటు మైనర్ పంచాయతీలకు సాధారణ నిధులు చాలా తక్కువగా ఉంటాయి. ఈ పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచి తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆర్థిక సంఘం నిధులే దిక్కుగా మారాయి. ప్రభుత్వం ఈ నిధులు ఇవ్వకపోవడంతో మైనర్ పంచాయతీలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి.
నిధులెప్పుడిస్తారో
రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అనేక సమస్యలతో సర్పంచ్లు సతమతమవుతున్నారు. కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వ దయ కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ఈ నిధులిస్తే గ్రామాల్లోని దళితవాడల్లో రోడ్లు, డ్రైన్ల అభివృద్ధికి, తాగునీటి సదుపాయాల కల్పనకు, చెల్లింపులకు అవకాశం దక్కేదని చెబుతున్నారు.
రాజకీయాలు తగునా బాబు?
గ్రామాల అభివృద్ధికి ఇబ్బందులు రానివ్వమని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవణ్కల్యాణ్ చెబుతుంటారు. కానీ, ఆర్థిక సంఘం నిధుల విడుదలకు వచ్చే సరికి రాజకీయం చేస్తున్నారని పలువురు సర్పంచ్లు ఆరోపిస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
దోమల వ్యాప్తి అధికం
వర్షాకాలం మొదలయ్యింది. పారిశుద్ధ్యం పనులు చేపట్టకపోతే దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. శివారు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే పైపులైన్ మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది. అప్పులు చేసి ఖర్చు చేయాల్సి వస్తోంది.
– పద్మనాభరెడ్డి, సర్పంచ్ కృష్ణంపల్లె పంచాయతీ
నెలలో రావచ్చు
పంచాయతీ నిధులు నెల రోజుల్లోపు వచ్చే అవకా శం ఉంది. వీటి పై రాష్ట్ర పంచాయతీ అధికారులను సంప్రదించాం. నెల.. నెలన్నర లోపు రావొచ్చని చె ప్పారు. సాధారణ నిధుల నుంచి అత్యవసర పను లకు అవసరమైతే వాడుకోవాలని తెలియజేశాం.
– సుధాకర్రావు, డీపీఓ
– IIలో
– IIలో
న్యూస్రీల్
మూడు నెలలు ముందే వచ్చిన 15వ ఆరిక్థ సంఘం నిధులు
జిల్లాకు మొత్తం రూ.30.32 కోట్లు
ఖర్చుచేయని కూటమి ప్రభుత్వం
వైఎస్సార్సీపీ సర్పంచ్లకు క్రెడిట్ వస్తుందని నాన్చుతున్న వైనం
మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్న పల్లె జనం
ఎదురు చూస్తున్నాం
15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్చిలో ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ నిధుల కోసం మూడు నెలలుగా వేచి చూస్తున్నాం.
– రజనీకాంత్, సర్పంచ్ వసంతాపురం
కంపు కొడుతున్న పల్లెలు
ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో పల్లెలు కంపుకొడుతున్నాయి. ఎక్కడ చూసినా పరిసరాలు అధ్వాన్నంగా మారాయి. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. అత్యవసర పనుల నిర్వహణ తలకు మించిన భారంగా మారింది.
– రవికుమార్, సర్పంచ్, బుగ్గ అగ్రహారం

చివరి దశకు అయ్యోర్ల బదిలీలు

చివరి దశకు అయ్యోర్ల బదిలీలు

చివరి దశకు అయ్యోర్ల బదిలీలు

చివరి దశకు అయ్యోర్ల బదిలీలు

చివరి దశకు అయ్యోర్ల బదిలీలు

చివరి దశకు అయ్యోర్ల బదిలీలు

చివరి దశకు అయ్యోర్ల బదిలీలు

చివరి దశకు అయ్యోర్ల బదిలీలు

చివరి దశకు అయ్యోర్ల బదిలీలు

చివరి దశకు అయ్యోర్ల బదిలీలు