అమ్మానాన్న లేని వాళ్లం! | - | Sakshi
Sakshi News home page

అమ్మానాన్న లేని వాళ్లం!

Jun 15 2025 8:07 AM | Updated on Jun 15 2025 8:07 AM

అమ్మా

అమ్మానాన్న లేని వాళ్లం!

‘మేం ఏ జన్మలో ఎవరికి ఏ పాపం చేశామో అర్థం కావడంలేదు. చిన్న తనంలోనే ఆ దేవుడు తల్లిదండ్రులను తీసుకెళ్లిపోయాడు. అనాథలుగా రోడ్డున పడేశాడు. ఎలా ఉండాలో.. ఏం చేయాలో తెలియడం లేదు. అమ్మానాన్న లేకుండా ఎలా బతకాలో అర్థం కావడం లేదు..’ అన్నట్టు ఆ చిన్నారులు వచ్చిపోయేవారిని దీనంగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం కలచి వేసింది. ఈ ఘటన మండలంలోని మామిడిగుట్టపల్లెలో శనివారం చోటు చేసుకుంది.

ఐరాల: చిత్తూరు– అరగొండ రోడ్డు బ్యాన్స్‌ హోటల్‌ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దంపతులు మృత్యువాత పడ్డారు. చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. బంధువుల కథనం మేరకు.. మండలంలోని మామిడిగుట్టపల్లెకు చెందిన రాజేష్‌(37)కు, తవణంపల్లె మండలం, తడకరకు చెందిన పూర్ణిమ(27)కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి హేమాన్‌(5), నిషాంత్‌(3) ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజేష్‌ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం తన స్వగ్రామం మామిడిగుట్టపల్లె నుంచి రాజేష్‌, పూర్ణి మ, పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంలో చిత్తూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో బ్యాన్స్‌ హోటల్‌ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద ఎదురుగా వస్తున్న ఓ లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దంపతులతో పాటు చిన్నారులకు గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన రాజేష్‌ను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పూర్ణిమ పరిస్థితి విషమంగా ఉండడంతో రాణిపేట సీఎంసీకి తరలించారు. చిన్నారులుకు స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలో రాజేష్‌ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పూర్ణిమ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. పెద్ద కుమారుడు హేమాన్ష్‌కు ఎడమ భుజం ఎముక విరగడంతో శస్త్ర చికిత్స అవసరమని డాక్టర్లు తేల్చారు. చిన్న కుమారుడు నిషాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.

కంటతడి పెట్టిన గ్రామస్తులు

రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. అమ్మానాన్న లేరని తెలిసి విలవిల్లాడిపోయారు. గుక్కపట్టి ఏడ్చుతున్న ఆ చిన్నారుల పరిస్థితిని చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. దంపతుల రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏ ఇద్దరు కలిసినా వారిగురించే చర్చించుకోవడం కనిపించింది. పోస్టుమార్టం అనంతరం పూర్ణిమ మృతదేహాన్ని మామిడిగుట్టపల్లెకు తరలించి శనివారం అంత్యక్రియులు ముగించారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ దంపతులు మృతి

అనాథలైన ఇద్దరు చిన్నారులు

కన్నీరుమున్నీరైన బంధువులు

అమ్మానాన్న లేని వాళ్లం!1
1/3

అమ్మానాన్న లేని వాళ్లం!

అమ్మానాన్న లేని వాళ్లం!2
2/3

అమ్మానాన్న లేని వాళ్లం!

అమ్మానాన్న లేని వాళ్లం!3
3/3

అమ్మానాన్న లేని వాళ్లం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement