
సెలవులో కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్ : వ్యక్తిగత పనుల నిమిత్తం కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ ఈనెల 20వ తేదీ వర కు సెలవు పెట్టారు. ఈ మేరకు ఇన్చార్జ్ కలెక్టర్ గా జేసీ విద్యాధరికి అద నపు బాధ్యతలు అప్పజెప్పారు. సెలవులు పూర్త య్యి తిరిగి విధుల్లో చేరే వరకు జాయింట్ కలెక్టర్ అధనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు.
మామిడి కిలో రూ.8కే కొనాలి
కాణిపాకం: జిల్లాకు నేనొచ్చాను..ఇకపై కేజీ మామిడి రూ.5,6,7 అంటే కుదరదు...కచ్చితంగా రూ.8కు కొనాల్సిందేనన్ని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. చిత్తూరు నగరం మంగసముద్రం ప్రాంతంలోని ఎంఎల్ఎస్ పాయింట్ ఆవరణలో శనివారం సాయంత్రం మామిడి రైతులు, గుజ్జు పరిశ్రమ దారులతో ముఖాముఖి నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని ఫ్యాక్టరీ యజమానులతో చర్చించామన్నారు. అన్ని కంపెనీలు కూడా కేజీ రూ.8కు కొనాల్సిందేనన్నారు. చెక్పోస్టులు పెట్టి జిల్లా రైతులకు న్యాయం చేస్తామన్నారు. మామిడి రైతులకు రూ.168 కోట్లు సబ్సిడీ రూపంలో అందజేస్తున్నామన్నారు. తొలుత మా జీ ఎమ్మెల్సీ దొరబాబు మంగసముద్రం యార్డు పరిస్థితిని మంత్రికి వివరించారు. చిత్తూరు నడిబొడ్డున్న ఉన్న కూరగాలయ మార్కెట్ వల్ల ఆస్పత్రికి వెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉందన్నారు. అసంపూర్తిగా నిలిచిన పనులను పూర్తి చేసేందుకు రూ.7.50 కోట్లు మంజూరు చేయాలని వినతి చేశారు. మామిడిలో దళారీ వ్యవస్థ వల్ల కేజీ రూ.5,6 పలుకుతోందని, రూ. 8కి కొనుగోలు చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు రాజన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఎంపీ డీ.ప్రసాదరావు, ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, ఎక్స్ సర్వీస్ హర్ట్ కల్చర్ సెక్రటరీ రాజశేఖర్ బాబు, ఆర్టికల్చర్ కమిషనర్ శ్రీనివాసులురెడ్డి, జాయింట్ కలెక్టర్ జీ.విద్యాధరి పాల్గొన్నారు.
శ్రీ సిటీని సందర్శించిన
ట్రైనీ ఐఏఎస్లు
సత్యవేడు : ఏపీ దర్శన్ సీడీ టూర్లో భాగంగా 2– 24బ్యాచ్కు చెందిన ఏడుగురు ట్రైనీ ఐఏఎస్లు శనివారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) శివశంకర్ వీరికి స్వాగతం పలికారు. శ్రీ సిటీ ప్రణాళిక, అత్యాధునిక మౌలిక సదుపాయాలు , సుస్థిర అభివృద్ధిపై వారికి ప్రదర్శన ఇచ్చారు. మేక్–ఇన్– ఇండియా మిషన్లో శ్రీసిటీ పాత్ర, భారీ ఉపాధి కల్పన, ఈ ప్రాత ఆర్థిక వ్యవస్థకు ఎలా ఊతమిచ్చారనే అంశాలను వివరించారు. పర్యటనలో భాగంగా ట్రైనీ ఐఏఎస్లు శ్రీసిటీ పరిసరాలు సందర్శించారు. మెండెలెస్ ( క్యాడ్బరీస్) డైకిన్, ఎయిర్ కండిషనింగ్ పరిశ్రమలను సందర్శించారు. ఇక్కడి ఉత్పత్తులు, పనితీరును తెలుసుకున్నారు. శ్రీ సిటీ ప్రణాళిక, అమలు, వ్యాపార అనుకూల వాతావరణాన్ని ప్రశ్నించిన ట్రైనీ ఐఏఎస్లు, ఇతరులు అనుసరించాల్సిన అద్భుత మోడల్గా దీనిని అభివర్ణించారు. ట్రైనీ ఐఏఎస్లే కాకుండా దేశ విదేశాలకు చెందిన అధికారులు, వ్యూహకర్తలు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు తమ అధ్యయనానికి శ్రీసిటీని ఎంచుకోవడం తమకు గర్వకారణమని శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు.