అన‘కొండ’లు! | - | Sakshi
Sakshi News home page

అన‘కొండ’లు!

Jun 15 2025 8:07 AM | Updated on Jun 15 2025 8:07 AM

అన‘కొండ’లు!

అన‘కొండ’లు!

● నాయనిచెరువు కొండపై కూటమి నేతల కన్ను

● విలువైన గ్రానైట్‌ కొట్టేసే యత్నం

● గ్రానైట్‌ బండలు తమిళనాడుకు తరలింపు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చిత్తూరు మండలం, నాయనిచెరు వు గ్రామ సమీపంలోని ఓ కొండను కూటమి నేతలు కూల్చేస్తున్నారు. విలువైన గ్రానైట్‌ను కాజేస్తున్నారు. కొండను బద్ధలు కొట్టి యథేచ్ఛగా తమిళనాడుకు తరలిస్తున్నారు. బ్లాక్‌ బండ మీటరు రూ.24 నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తున్నారు. ఇలా రోజుకు రూ.5 లక్షల వరకు దండుకుంటున్నారు. గ్రానైట్‌ వాహన రాకపోకల వల్ల రాత్రి పూట ఇబ్బందికరంగా మారింది. నాటు బాంబులు పేల్చి నిద్రలేకుండా చేస్తున్నారని సమీప గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమార్కుల ధాటికి అడవి జంతువులు కూడా ఊళ్ల మీదకు వస్తున్నాయని వాపోతున్నారు. ఇదేమని ప్రశ్ని స్తే ప్రజాప్రతినిధుల పేరు చెప్పి అక్రమార్కులు బయపెడుతున్నట్టు వారు పేర్కొంటున్నారు.

వారానికి రూ.50 వేలు

సంబంధిత శాఖ అధికారులకు వారం వారం రూ.50 వేల చొప్పున మామూళ్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే కొండను తవ్వేస్తున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని, లేనిపక్షంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని స్థానికులు చెబుతున్నారు. దీనిపై మైనింగ్‌ శాఖ అధికారి ఏడీ సత్యనారాయణను వివరణ కోరగా పెద్దిశెట్టిపల్లిది కూడా ఫిర్యాదు వచ్చింది.. నాయని చెరువులో జరుగుతున్న క్వారీని కూడా పరిశీలిస్తాం.. అనుమతి లేదని తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement