హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు

May 1 2025 1:52 AM | Updated on May 1 2025 1:52 AM

హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు

హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు

చిత్తూరుఅర్బన్‌: నగరంలో వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన నాగరత్నం అనే నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. నగర శివార్ల లోని పట్రాంపల్లెకు చెందిన దిలీప్‌కుమార్‌ అనే వ్యక్తిపై పాత కక్షల నేపథ్యంలో నాగరత్నం అనే వ్య క్తి గతవారం కత్తితో పొడిచి పారిపోయాడు. బాధితుడి తండ్రి రామచంద్రయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితున్ని అరెస్టు చేసి, మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరిచారు. నిందితుడికి మేజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండు విధించడంతో చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు.

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

గంగవరం: మూడు నెలల కిందట కొడుకు మృతి చెందడం తీవ్ర మనస్తాపానికి గురైన ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడి న ఘటన మండలంలో బుధువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని చిన్నూరు గ్రామానికి చెందిన వెంకటేష్‌(54) పలమనేరు పట్టణంలో మారెమ్మగుడి ఎదురుగా దేవుళ్ల పటా ల దుకాణం నడుపుతున్నాడు. మూడు నెలల క్రి తం కొడుకు కిరణ్‌(27) బెంగుళూరులో ఆత్మహ త్య చేసుకుని మృతి చెందాడు. కొడుకు మృతి చెందినప్పటి నుంచి తండ్రి వెంకటేష్‌ తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. మూడు నెలలుగా ఇంట్లో సక్రమంగా భోజనం చేయకపోవడం, దుకాణం తెరవకపోవడం, ఇంటి పట్టున సక్రమంగా ఉండడం లే దు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. తీరా చూస్తే మా రేడుపల్లికి సమీపంలోని కౌండిణ్య నది వద్ద చింతచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పల మనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement