
అయ్యా..మా మొర ఆలకించండి సారూ!
● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ ● పలు సమస్యలపై 275 అర్జీల స్వీకరణ
చిత్తూరు కలెక్టరేట్ : అయ్యా.. మా మొర ఆలకించి న్యాయం చేయండంటూ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఉన్నతాధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు విచ్చేసి తమ సమస్యల పరిష్కారానికి అర్జీలు అందజేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్వో మోహన్కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
గ్రామకంఠంగా మార్చండి
తమ గ్రామంలోని పలు సర్వే నంబర్లను గ్రామ కంఠంగా మార్చాలని చౌడేపల్లె మండలం తమినిగుంట గ్రామానికి చెందిన అర్జీదారులు నల్లప్పరెడ్డి, వేణుగోపాలు కోరారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ తమ గ్రామంలోని 9 ఎకరాల్లో 182 కుటుంబాలు నివాసం ఉంటున్నాయన్నారు. సర్వే నెంబర్లు 170/1,744,778,757 ను గ్రామకంఠంగా మార్చాలని కోరారు.

అయ్యా..మా మొర ఆలకించండి సారూ!